దగ్గరికి రావడం లేదని ఉరివేసి కొడుకుని చంపిన తల్లి
శాస్త్రవేత్త అయిన ఆమె భర్త డ్రెహ్రాడూన్లో డిఆర్డిఓలో విధులు నిర్వహిస్తున్నారు. విషయాన్ని ఆయనకు తెలపడంతో అక్కడినుంచి హుటాహుటిన బయల్దేరి కోల్కతాకు చేరుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు దేవజాని చౌధురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఆత్మహత్యకు యత్నించిన ఆమె గదిలో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభించింది. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని దేవజాని చౌధురి తన సూసైడ్ నోట్లో పేర్కొంది.
తన కుమారుడు దేవాంగ చాలా చిన్నవాడని, తల్లికి దూరంగా ఉంటూ చాలా బాధ అనుభవిస్తున్నాడని, అందుకే అతడ్ని హత్య చేస్తున్నట్లు అందులో దేవజాని తెలిపింది. కాగా, దేవజాని తన భర్తతోపాటు డెహ్రాడూన్లో నివాసం ఉండేది. అయితే కొంత మానసిక సమస్యలు ఏర్పడటంతో చికిత్స కోసం కోల్కతాకు తన కుమారుడితోపాటు వచ్చింది. ఇక్కడే ఉన్న దేవజాని సోదరులు ఆమె కోసం ఓ ఫ్లాట్ తీసుకున్నారు. వారికి ఆ ఫ్లాట్ దగ్గరగానే ఉంటుంది.
కాగా, అతని కుమారుడు ఎక్కువగా సోదరులు వద్దే ఉండేందుకు ఇష్టపడుతుండటంతో ఆమె కొంత మనస్తాపానికి గురైంది. దీంతో దేవాంగ తన దగ్గరికి తీసుకువచ్చుకున్న చౌధురి, ఆదివారం ఉదయం దుప్పట్టతో అతనికి ఉరివేసి హత్య చేసింది. తర్వాత ఆమె కూడా కత్తితో గొంతు, చేతులు కోసుకుంది. అక్కడికి చేరుకున్న ఆమె సోదరులు పోలీసులకు సమాచారం ఇచ్చి, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.