Lady: పనిమీద వెళ్లిన భర్త, డ్రాప్ ఇస్తామని భార్యను అడవిలోకి లాక్కెళ్లి, మ్యాటర్ లీక్ అవుతోందని, ఫినిష్ !
జైపూర్/ రాజస్థాన్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తోంది. భర్త, పిల్లలతో కలిసి ఆమె అత్తగారి ఊరిలో నివాసం ఉంటున్నది. వివాహిత మహిళ అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చి వెలుతోంది. కొన్నిసార్లు భర్త బైక్ లో డ్రాప్ చేస్తున్నారు. భర్తకు ఏదైనా పని ఉన్న సమయంలో ఆమె బస్సులో పుట్టింటికి వచ్చి వెలుతోంది. భర్తకు పని ఉందని చెప్పడంతో ఆమె బస్సులో పుట్టింటికి బయలుదేరింది. బస్సు దిగిన మహిళ ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్న గ్రామానికి నడుచుకుంటూ బయలుదేరింది. మార్గం మద్యలో బైక్ లో వెళ్లిన ముగ్గురు నిందితులు ఆమెకు పుట్టింటి దగ్గర డ్రాప్ ఇస్తామని నమ్మించారు. మహిళ పుట్టింటికి వైపు వెళ్లకుండా సమీపంలోని అటవి ప్రాంతానికి ఆమెను బలవంతంగా పిలుచుకుని వెళ్లారు. కామాంధులు వివాహిత మహిళ మీద సామూహిక అత్యాచారం చేశారు. మహిళను ప్రాణాలతో వదిలేస్తే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తోందనే భయంతో ఆమెను చంపేసి శవాన్ని తీసుకెళ్లి పాడుపడిన బావిలో విసిరేసి చేతులు దులుపుకున్నారు.

భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్న భార్య
రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో 35 ఏళ రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. దౌసాలోనే ఓ వ్యక్తిని వివాహం చేసుకున్న రేఖా ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తోంది. భర్త, పిల్లలతో కలిసి రేఖా దౌసా జిల్లాలోని ఆమె అత్తగారి ఊరిలో నివాసం ఉంటున్నది.

పుట్టింటికి వచ్చి వెలుతున్న మహిళ
రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలోని బస్సీ సమీపంలో రేఖా తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. వివాహిత మహిళ రేఖా అప్పుడప్పుడు జైపూర్ సమీపంలోని బస్సీ ప్రాంతంలోని పుట్టింటికి వచ్చి వెలుతోంది. కొన్నిసార్లు భర్త బైక్ లో రేఖాను ఆమె పుట్టింటి దగ్గర డ్రాప్ చేస్తున్నాడ.

బస్సులో వెళ్లిన మహిళ
భర్తకు ఏదైనా పని ఉన్న సమయంలో రేఖా బస్సులో జైపూర్ సమీపంలోని బస్సీలోని పుట్టింటికి వచ్చి వెలుతోంది. భర్తకు పని ఉందని చెప్పడంతో రేఖా ఆదివారం బస్సులో పుట్టింటికి బయలుదేరింది. బస్సు దిగిన రేఖా ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్న గ్రామానికి నడుచుకుంటూ బయలుదేరింది.

డ్రాప్ ఇస్తామని నమ్మించిన కామాంధులు
మార్గం మద్యలో బైక్ లో వెళ్లిన ముగ్గురు నిందితులు మీ పుట్టింటి దగ్గర డ్రాప్ ఇస్తామని రేఖాను నమ్మించారు. నిందితుల మాయమాటలు విన్న రేఖా బైక్ లో ఆమె పుట్టింటికి బయలుదేరింది. రేఖాను ఆమె పుట్టింటికి వైపుకు పిలుచుకుని వెళ్లకుండా సమీపంలోని అటవి ప్రాంతానికి ఆమెను బలవంతంగా పిలుచుకుని వెళ్లారు.

రేప్ చేసి శవాన్ని బావిలో వేశారు
కామాంధులు వివాహిత మహిళ రేఖా మీద సామూహిక అత్యాచారం చేశారు. రేఖాను ప్రాణాలతో వదిలేస్తే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తోందనే భయంతో ఆమెను చంపేసి శవాన్ని తీసుకెళ్లి పాడుపడిన బావిలో విసిరేసి చేతులు దులుపుకున్నారు. రేఖా ఇంటికి రాకపోవడంతో ఆదివారం రాత్రి ఆమె కుటుంబ సభ్యులు దౌసాలోని పచవార పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒక్కడు చిక్కాడు... మిగిలిన వాళ్లు ఎస్కేప్
అప్పటి నుంచి రేఖా కోసం గాలించిన పోలీసులు చివరికి పాడుపడిన బావిలో ఆమె శవాన్ని గుర్తించారు. వివాహిత మహిళ మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో కాలురామ్ అనే నిందితుడిని అరెస్టు చేశామని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి గుప్తా స్థానిక మీడియాకు చెప్పారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications