Lady: ఫస్ట్ భర్తతో ఢిష్యూం ఢిష్యూం, రెండో భర్త చేతిలో ఫినిష్, కట్టిన తాళితోనే కైలాసానికి గేట్ పాస్ !
చెన్నై/ టీ నగర్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కొంతకాలానికే దంపతులు విడిపోయారు. భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటిలో ఉంటున్న భార్య ఆదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని కొంతకాలం అతనితో ఎంజాయ్ చేసింది. తరువాత ప్రియుడిని రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్తతో వేరే ప్రాంతంలో ఆమె కాపురం పెట్టింది. కొత్త ఇంటికి వెళ్లిన తరువాత మహిళకు, ఆమె రెండో భర్త గొడవలు జరుగుతున్నాయి. అర్దరాత్రి ఇంటి నుంచి భార్యను బయటకులాగిన రెండో భర్త ఆమె మెడలోని తాళితోనే ఆమె గొంతు బిగించి హత్య చెయ్యడం కలకలం రేపింది.
Girlfriend: ప్రియురాలిని ముక్కలుగా నరికి 6 కిలోమీటర్లు తల ఎత్తుకెళ్లిన మాజీ బాయ్ ఫ్రెండ్, యవ్యారం !
ఫస్ట్ మొగుడితో ఢిష్యూం ఢిష్యూం
చెన్నైలోని అంబత్తూరులోని కేకే నగర్ లో పవిత్రా (28) అనే మహిళ నివాసం ఉంటున్నది, కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన రాజేష్ అనే యువకుడిని పవిత్రా వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత రెండు సంవత్సరాలు రాజేష్, పవిత్రా దంపతులు సంతోషంగా కాపురం చేశారు.
పుట్టింటికి వెళ్లిపోయింది
తరువాత పవిత్రా, రాజేష్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్త రాజేష్ తో ఎక్కుగా గొడవలు పడుతున్న పవిత్రా అతనికి సినిమా చూపించింది. కొంతకాలానికే రాజేష్, పవిత్రా దంపతులు విడిపోయారు. పవిత్రా చెన్నైలోని ఫుజ్ పల్ ప్రాంతంలోని కదిరివేల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
ప్రియుడితో రొమాన్స్.... రెండో పెళ్లి
పుట్టింటిలో ఉంటున్న పవిత్రా ఆదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజా (35) అనే వ్యక్తితో చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం రాజాతో పవిత్రా ఎంజాయ్ చేసింది. తరువాత ప్రియుడు రాజాను ఆరు నెలల క్రితం పెరియపాళంలోని అమ్మాన్ ఆలయంలో పవిత్రా రెండో పెళ్లి చేసుకుంది.
10 రోజుల క్రితమే కొత్త ఇంటిలో కాపురం
కొంతకాలం అదే ఏరియాలో కాపురం చేసిన రాజా, పవిత్రా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య పవిత్రా తీరుతో ఆమె రెండో భర్త రాజాకు అనుమానం మొదలైయ్యింది. తన భార్య పవిత్రా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో రాజా 10 రోజుల క్రితం చెన్నైలోని అంబత్తూరు సమీపంలోని కల్లికుప్పం ఏరియాలో అద్దె ఇంటిని తీసుకుని అక్కడికి కాపురం మార్చాడు.
అర్దరాత్రి రచ్చరచ్చ
కొత్త ఇంటికి మారిన తరువాత కూడా ప్రతిరోజు రాజా, పవిత్రా దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అర్దరాత్రి పవిత్రా, రాజా దంపతులు గొడవపడ్డారు. రాత్రి 2 గంటల సమయంలో రాజా అతని భార్య పవిత్రాను ఇంటి నుంచి బయటకు లాక్కొని వచ్చి గొడవ పెట్టుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తాళిబొట్టుతో భార్యను చంపేసిన రెండో భర్త
పవిత్రా మెడలో కట్టిన తాళితోనే ఆమె గొంగు బిగించిన రెండో భర్త రాజా ఆమెను హత్య చేసి పరారైనాడు. పోలీసులు వచ్చే లోపు పవిత్రా రోడ్డు మీద శవమైయ్యింది. రాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొదటి భర్త రాజేష్ ను వదిలేసి రెండో భర్త రాజాతో కాపురం చేస్తున్న పవిత్రా అతని చేతితో హత్యకు గురికావడం కలకలం రపింది.