Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దుమ్ములేపేసిన ఐటీ హబ్ ప్రజలు, మెట్రో రైళ్లు గడగడ, కూసాలు కదిలిపోయాయి !

దేశవ్యాప్తంగా కొన్నేళ్లుగా మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఒక్కరోజులోనే లక్షలాది మంది మెట్రోలో ప్రయాణించారు. నిన్న ఒక్కరోజే అంటే డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి బెంగళూరు మెట్రో రైలులో 6,26,202 మంది ప్రయాణించారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 2.15 గంటల వరకు అధిక సంఖ్యలో ప్రజలు నమ్మ బెంగళూరు మెట్రో రైలు సేవలను సద్వినియోగం చేసుకున్నారు.

బెంగళూరులోని ఎంజీ రోడ్ మెట్రో మార్గంలో ఎక్కువ మంది ప్రయాణించారు. ఇందిరానగర్‌తోపాటు బెంగళూరు నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలలో ప్రజలు సంచరించారు. బెంగళూరు నగరం నడిబొడ్డున ఉన్న మెజెస్టిక్ నుంచి ఎక్కువ మంది అన్ని వైపులా ప్రయాణిస్తుంటారు. న్యూ ఇయర్ సందర్బంగా నమ్మ బెంగళఊరు మెట్రో రైలు టైమింగ్స్ పొడిగింంచారు. ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చి స్ట్రీట్, బెంగళూరులోని మెజస్టిక్ తో సహా అనేక ప్రదేశాలలో నూతన పంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి ప్రజలు డిసెంబర్ 31 రాత్రి ప్రయాణించారు.

Lakhs of commuters traveled by Bengaluru Metro train till early morning on Monday.

కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఈ ప్రాంతాల్లో వేలాది మంది యువతి, యువకులు గుమిగూడారు. దీంతో ఈ రూట్లలో నమ్మ బెంగళూరు మెట్రో సర్వీసులతో పాటు అదనపు బీఎంటీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీ రాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సర్వీసును పొడిగించారు.

Lakhs of commuters traveled by Bengaluru Metro train till early morning on Monday.

బెంగుళూరు వాసులు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు మ్యూజికల్ పోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, విందులు, వినోదాలుతో పాటు పలు కార్యక్రమాతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోవడానికి పలు ప్రాంతాల్లో కలిశారు. కొత్త సంవత్సర వేడుకలకు బెంగళూరు కేంద్ర బిందువుగా ఉన్న ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో ఆదివారం ఉదయం నుంచి జనంతో కిక్కిరిసిపోయింది. లక్షల మందితో రద్దీగా ఉండే ఈ రెండు వీధులు మిరుమిట్లు గొలిపే లైట్లతో లక్షలాది మందిని ఆకర్షించాయి.

సాయంత్రానికి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు మొదలవడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ రోడ్లపై జనం అరుస్తున్నారు. ఇది కాకుండా అనేక ముఖ్యమైన వాణిజ్య కేంద్ర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో కళ్లు జిగేల్ అనేలా అలంకరించారు. ఈ నేపథ్యంలో సెన్సిటివ్ ఏరియా, వేడుకలు జరుగుతున్న రోడ్ల వద్ద మరింత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విలాసవంతమైన హోటళ్లు, పబ్బులు సిలికాన్ సిటీ ప్రజల కోసం అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు.

బెంగళూరు నగరంలో ఎక్కువగా గుమిగూడే ఇందిరా నగర్, కోరమంగళ, ఎలక్ట్రానిక్ సిటీ, వైట్‌ఫీల్డ్‌లోని పబ్‌లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, మాల్స్‌ను అలంకరించి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. దీంతో పాటు 2023 సంవత్సరం చివరి రోజు ఆదివారం రావడంతో వివిధ పబ్‌లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, మాల్స్‌లో డిన్నర్‌ పార్టీలు, డీజే మ్యూజిక్‌ ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేశారు. పార్టీలకు హాజరయ్యే కస్టమర్లకు డజన్ల కొద్దీ పబ్‌లలో రాయితీలు ప్రకటించారు.

Lakhs of commuters traveled by Bengaluru Metro train till early morning on Monday.
అంతే కాకుండా కొన్ని చోట్ల జంటలకు, ఫ్యామిలీలకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. పార్టీలకు ప్రవేశ రుసుము రూ.3 000 నుండి రూ.10, 000, రూ 20, 000 వరకు ధరలు నిర్ణయించారు. వీటన్నింటిని సిలికాన్ సిటీ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ప్రాంతాలన్నింటికీ అధిక సంఖ్యలో ప్రజలు మెట్రోలో ప్రయాణించారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడిపే అవకాశం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మినహా అన్ని ఫ్లై ఓవర్లపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య ఊహించని విధంగా విపరీతంగా పెరిగింది. దీంతోపాటు ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఉదయం 7 గంటల వరకు 48 చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వీలింగ్, డ్రాగ్ రేస్ కార్యకలాపాలను అరికట్టేందుకు బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా గస్తీ తిరిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+