బ్రిటన్ రాజకుటుంబాన్ని కూడా వదలని లలిత్ మోడీ
లండన్: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంలో రాజకీయాలను హీటెక్కిస్తోంది. తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వసుంధర రాజే, సుష్మా స్వారాజ్లను వివాదంలోకి లాగి బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టారు.
ఇప్పుడు బ్రిటిష్ రాజు చార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూ పేర్లను కూడా ఉపయోగించుకొని యూకే హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి ట్రావెల్ డాక్యుమెంట్లు పొందినట్లు ది సండే టైమ్స్ వెల్లడించింది.
క్వీన్ ఎలిజబెత్ రెండో కుమారుడైన ఆండ్రూతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకొని లలిత్ మోడీ ప్రయాణ పత్రాలు పొందారని తెలిపింది. ట్రావెల్ డాక్యుమెంట్లు తన చేతికి రావడానికి కొన్ని రోజుల ముందే లలిత్ మోడీ ఆండ్రూను కలిశారని వెల్లడించింది.
లలిత్ మోడీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్లు అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేష్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్ వార్తలు రావడంతో భారత్లో రాజకీయంగా పెను దుమారం చెలరేగింది.