భార్యకు 'నో ఛాన్స్'.. కుమార్తెను నామినేట్ చేసిన లాలూ
పాట్నా : దేశంలో రాజ్యసభ ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఖాళీ అయిన స్థానాలకు ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా బీహార్ లోను రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు పలువురు నేతలు.
ఇందులో భాగంగానే.. లాలూ భార్య రబ్రీదేవిని ఆర్జేడీ తరుపున రాజ్యసభకు పంపిస్తారన్న ఊహాగానాలకు తెరదించుతూ కూతురు మిసా భారతి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కోర్టు కేసుల్లో తన తరుపున వాదించి తనను చిక్కుల్లో నుంచి బయటపడేసిన రాంజెఠ్మాలనీని కూడా ఆర్జేడీ తరుపున రాజ్యసభకు నామినేట్ చేశారు.
ముందునుంచి ఆర్జేడీ తరుపున లాలూ భార్య రబ్రీదేవికే అవకాశం దక్కుతుందని అంతా భావించినా.. చివరి నిముషంలో సస్పెన్స్ కు తెరదించుతూ కుమార్తె మిసా భారతిని లాలూ నామినేట్ చేశారు.

ఇక రాంజెఠ్మాలనీ కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. జేడీ(యూ) నేత శరద్ యాదవ్ తో పాటు, నితీశ్ కుమార్ అనుచరుడు ఆర్సీపీ సింగ్ కూడా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభకు నామినేట్ చేసినందుకు గాను ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు రాంజెఠ్మాలనీ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లాలూ ప్రసాద్ కు తాను స్నేహితుడినని, అలాగే రక్షకుడిని కూడా అని తెలిపారు.
ఇకపోతే బీజేపీ తరుపున ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్ నారాయణ సింగ్ ని పార్టీ తరుపున రాజ్యసభకు నామినేట్ చేసింది. బీహార్ తరుపున రాజ్యసభలో ఖాళీ అవనున్న ఐదు స్థానాల కోసం ఈ నేతలు పోటీ పడనున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications