Leader: గుడి భూమి విషయంలో గొడవ, కోర్టులో వివాదం, రాజీకి పిలిచి ఇద్దరిని లేపేసిన పొలిటికల్ లీడర్ !
బెంగళూరు/తుమకూరు: ఒకే ఊరిలో నివాసం ఉంటున్న రెండు కుటుంబాల మద్య భూమి విషయంలో గొడవలు ఉన్నాయి.. ఆ భూమి గుడికి ఇవ్వడం వలన రెండు కుటుంబాల మద్య చాలా సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. ఇదే విషయంలో మాట్లాడాలని రెండు కుటుంబాలు ఒకచోట చేరాయి. ఆ సందర్బంలో పెద్దమనుషలు కూడా అక్కడికి చేరారు. ఆ సందర్బంలో జరిగిన గొడవల కారణంగా ఓ పార్టీ నాయకుడి చేతిలో ఇద్దరు హత్యకు గురికావడం కలకలం రేపింది.
గుడి భూమి విషయంలో ?
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలుకాలోని మిడిగేశి గ్రామంలో జేడీఎస్ నాయకుడు శ్రీధర్ గుప్తా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇదే గ్రామంలో రామాంజనయయ (42), శిల్పా (38) దంపతులు నివాసం ఉంటున్నాడు. ఊరిలోని వినాయకుడి గుడికి చెందిన భూములు శ్రీధర్ గుప్తా కాజేయడానికి ప్రయత్నించడంతో రామాంజనయ్య, శిల్పా దంపతులు అడ్డుకున్నారు.
కోర్టుకు వెళ్లిన ఇరు వర్గాలు
ఒకే ఊరిలో నివాసం ఉంటున్న శ్రీధర్ గుప్తా కుటుంబం, శిల్పా కుటుంబాల మద్య వినాయుడి గుడికి సంబంధించిన భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఆ భూమి గుడికి ఇవ్వడం వలన రెండు కుటుంబాల మద్య చాలా సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. శ్రీధర్ గుప్తా, శిల్పా కోర్టును ఆశ్రయించారు.
మాట్లాడాలని పిలిపించిన లీడర్ ?
ఇదే విషయంలో మాట్లాడాలని శ్రీధర్ గుప్తా ప్రత్యర్థి శిల్పా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. శ్రీధర్ గుప్తా, శిల్పా కుటుంబాలు ఊరి మధ్యలో రచ్చ దగ్గర చేరాయి. ఆ సందర్బంలో ఊరి పెద్దమనుషలు కూడా అక్కడికి చేరారు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన శ్రీధర్ గుప్తా, అతని అనుచరులు కత్తులతో శిల్పా, రామాచంజయ్యపై దాడులు చేశారు. అడ్డు వెళ్లిన మల్లికార్జునయ్య మీద కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలైన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు.
ఇద్దరి ప్రాణం పోయింది
అయితే అప్పటికే రామాంజనయ్య, శిల్పా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసులు అన్నారు. తీవ్రగాయాలైన మల్లికార్జునయ్యకు తుమకూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీసులు అన్నారు. గుడికి సంబంధించిన భూమి కోసం జరిగిన గొడవల కారణంగా జేడీఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ గుప్తా చేతిలో మహిళతో సహ ఇద్దరు హత్యకు గురికావడం కర్ణాటకలో కలకలం రేపింది.