పాఠశాలలోకి చిరుతపులి, వ్యక్తి పోరాటం! (పిక్చర్స్)
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని విబ్జియార్ పాఠశాలలోకి ఆదివారం వేకువజామున నాలుగు గంటలకు చిరుతపులి వచ్చింది.
దానిని బంధించేందుకు 12 నుంచి 13 గంటలు పట్టింది. చిరుతను బంధించే క్రమంలో పలువురు గాయపడ్డారు.
గాయాలైన వారిలో వైల్డ్ లైఫ్ ఆక్టివిస్ట్, కన్సర్వేషనిస్ట్ సంజయ్ గుబ్బి, చీఫ్ కన్సర్వేషనిస్ట్ డ్రైవర్ బెన్నాలు కూడా ఉన్నారు. వారిని వెంటనే అపోలో ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఎట్టకేలకు అధికారులు చిరుతపులిని బంధించారు.

చిరుతపులి
బెంగళూరులోని విబ్జియార్ పాఠశాలలోకి ఆదివారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఓ చిరుత ప్రవేశించింది. దీన్ని పట్టుకొనే క్రమంలో ఐదుగురు అటవీ శాఖ సిబ్బంది, ఓ టీవీ కెమెరామెన్ కూడా గాయపడ్డారు.

చిరుతపులి
పాఠశాలలోకి చిరుత ప్రవేశించినట్లు ఉదయం ఆరు గంటల సమయంలో కాపలా సిబ్బంది సీసీ కెమేరాల ద్వారా గుర్తించి పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

చిరుతపులి
పాఠశాల ముందు, వెనుక ఉన్న ద్వారాల వద్ద బోన్లు పెట్టి, ఆయా విభాగాల్లో వలలు ఏర్పాటు చేశారు. పాఠశాల గదుల నుంచి మూడుసార్లు బయటకు వచ్చిన చిరుత అక్కడి సిబ్బంది, గుమిగూడిన స్థానికులను చూసి మళ్లీ లోనికి వెళ్లిపోయింది.

చిరుతపులి
సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల సమయంలో పాఠశాల ఆవరణలోని ఈతకొలను వద్దకు రాగా, మత్తు మందుతో కూడిన రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.

చిరుతపులి
ఆ వెంటనే స్పృహ కొల్పోతోందని భావించి దగ్గరకు వెళ్లిన సంతోష్ అనే ఒక టీవీ కెమెరామెన్, ఐదుగురు అటవీ శాఖ సిబ్బందిపై చిరుత దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి.

చిరుతపులి
ఈ ఘటనలో సంతోష్ ఎడమకాలు ఎముక విరిగిపోయింది. చివరకు చిరుత పాఠశాల మరుగుదొడ్డి గది వద్ద స్పృహ తప్పి పడిపోయింది.

చిరుతపులి
అటవీ సిబ్బంది వలల సహాయంతో పట్టుకుని బన్నేరుఘట్ట అటవీ విభాగానికి తరలించారు. గాయపడ్డ అందర్నీ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications