నాకు, విజయశాంతికి ప్రాణహాని: పన్నీరు వర్గంపై సరస్వతి ఫిర్యాదు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, శశికళ వర్గం నాయకురాలు సరస్వతి ఆరోపించారు.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, శశికళ వర్గం నాయకురాలు సరస్వతి ఆరోపించారు. తనతోపాటు ప్రముఖ సినీ నటి విజయశాంతిలకు కూడా ప్రాణహాని ఉందని చెప్పారు. ఈ మేరకు చెన్నై నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా మద్దతు తెలపవచ్చని, అలాగే తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ వైపు నిలిచానని తెలిపారు. దీంతో తన మొబైల్కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సరస్వతి తెలిపారు. ఇవన్నీ కూడా విదేశాల నుంచి చేస్తున్నారని చెప్పారు.

ఇలాంటివే మాజీ మంత్రులు వలార్మతి, గోకుల ఇందిర, సినీ నటి విజయశాంతిలకు కూడా బెదిరింపు ఫోన్లు వస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి వెనుక పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే ఐటీ విభాగం మాజీ ఆఫీస్ బేరర్ రామచంద్రన్ల హస్తం ఉన్నట్లు ఆమె ఆరోపించారు.
సత్వర విచారణ జరిపి బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారనే నమ్మకం పోలీసులపై ఉందని సరస్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే శశికళకు మద్దతు తెలిపినందుకు ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబసభ్యులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించిన విషయం తెలిసిందే.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications