అయోధ్య తరహాలో పూరీ-ఆర్ధిక కేంద్రంగా మార్చేందుకు ఒడిషా సర్కార్ ప్లాన్..!
ఉత్తరాదిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యను ఆధునిక ఆధ్యాత్మిక నగరంగా, ఆర్ధిక ఊతకర్రగా మార్చుకునేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దక్షిణాదిన ఒడిశాకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్నాథుడు కొలువైన పూరీ నగరాన్ని సైతం ఇలాగే ప్రపంచ వారసత్వ నగరంగా, రాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంగా మార్చేందుకు నవీన్ పట్నాయక్ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని నవీన్ వారసుడిగా భావిస్తున్న 5టీ ఛైర్మన్ వీకే పాండియన్ తెలిపారు.
తాజాగా రాష్ట్రంలోని తలబానియాలో పర్యటించిన 5టీ ఛైర్మన్ వీకే పాండియన్ నవీన్ పట్నాయక్ సర్కార్ పూరీని రాష్ట్రానికి ఆర్ధిక ఊతంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో పూరీని ప్రపంచ వారసత్వ నగరంగా కూడా మార్చబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నా తమ ప్రభుత్వం మాత్రం ఇది పూర్తయ్యే వరకూ ఆగేది లేదన్నారు.

పూరీలో త్వరలో కొత్త విమానాశ్రయం వస్తుందని, రాజధాని భువనేశ్వర్ కూ, పూరీకి మధ్య ఎనిమిది లైన్ల హైవే కూడా వస్తుందని వీకే పాండియన్ తెలిపారు. మెట్రో రైలును కూడా పూరీ వరకూ పొడిగిస్తామన్నారు.

పూరీలో జరుగుతున్న అభివృద్ధిపై విపక్షాల విమర్శలకు స్పందిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. గత 500 ఏళ్లలో పూరీలో జరగని అభివృద్ధని నవీన్ మూడేళ్లలో చేసి చూపించారన్నారు. తాజాగా ప్రభుత్వం పూరీలో ప్రాజెక్టుల కోసం 2 వేల కేట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications