Lockdown: లాక్ డౌన్ పొడగింపు, డేట్ ఫిక్స్ చేసిన సీఎం, ఆరోజు వరకు అంతే, టైమింగ్ చైంజ్ !
బెంగళూరు: కరోనా వైరస్ దెబ్బతో ఐటీ హబ్ బెంగళూరు సిటీతో సహ కర్ణాటక మొత్తం హడలిపోతుంది. వీకెండ్ లాక్ డౌన్, డే అండ్ నైట్ కర్ఫ్యూ అమలు చేసినా కరోనా వైరస్ మాత్రం అంతంత మాత్రంగానే కట్టడి అవుతోంది. జూన్ 7వ తేదీతో లాక్ డౌన్ గడుపు పూర్తి అవుతోంది. అయితే కర్ణాటకలో మరోసారి వారం రోజులు జూన్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ విస్తరించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ బీటీ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లోని నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే లాక్ డౌన్ నియమాలు సడలించిన ప్రభుత్వం ప్రజలు కొంచెం ఊరిపిపీల్చుకోవడానికి అవకాశం ఇచ్చింది.
Lady teacher: కత్తిలాంటి మేడమ్, కండలు తిరిగిన విద్యార్థి రొమాన్స్, ఎస్కేప్, కిడ్నాప్ కేసుతో!
దెబ్బకు హడలిపోయిన ప్రజలు
ఐటీ హబ్ బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో కొంతకాంగా కరోనా వైరస్ మహమ్మారి భరతనాట్యం చేసింది. కర్ణాటకలో నమోదు అవుతున్న కరోనా పాజటివ్ కేసుల్లో ఎక్కువ శాతం బెంగళూరులోనే నమోదు కావడంతో ఇంతకాలం ప్రజలు హడలిపోయారు. కర్ణాటకలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉంది.
జూన్ 7వ తేదీ వరకు అనుకుంటే ?
ప్రస్తుతం కర్ణాటకలో విధించిన లాక్ డౌన్ జూన్ 7వ తేదీతో పూర్తి అవుతోంది. ప్రభుత్వం ఊహించిన విధంగా కర్ణాటకలో కరోనా వైరస్ కట్టడికాలేదని మరోసారి వెలుగు చూసింది. నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాపించడం మొదలుపెట్టింది. అందువలన లాక్ డౌన్ ను విస్తరించాలని నిపుణలు ప్రభుత్వానికి సూచించారని తెలిసింది.
జాన్ 14వ వరకు లాక్ డౌన్..... అయితే టైమింగ్ చైంజ్
ప్రస్తుతం
ఉదయం
6
గంటల
నుంచి
ఉదయం
10
గంటల
వరకు
ప్రభుత్వ
ఆదేశాల
మేరకు
కొన్ని
వ్యాపారాలు
నిర్వహించుకోవడానికి
అవకాశం
ఉంది.
అయితే
లాక్
డౌన్
పొడగిస్తున్న
సందర్బంగా
లాక్
డౌన్
నియమాల్లో
ప్రభుత్వం
కొన్ని
మార్పులు
చేసింది.
ఇప్పుడు
ఉదయం
6
గంట
నుంచి
10
గంటల
వరకు
తీస్తున్న
షాపులు
జూన్
14వ
తేదీ
వరకు
మద్యాహ్నం
2
గంటల
వరకు
తియ్యడానికి,
ఆ
సమయం
వరకు
ప్రజలు
సంచరించడానికి
ప్రభుత్వం
అవకాశం
ఇచ్చింది.
ఐటీ హబల్ లో కరోనా దెబ్బతో గులాబ్ జామ్
బెంగళూరు నగరంలో ఇప్పటి వరకు 7.2 లక్షల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యియి. కరోనా మహమ్మారి దెబ్బతో బెంగళూరు నగరంలో మాత్రమే 8, 716 మంది మరణించారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మీద కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో బెంగళూరు నగర ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకున్నారని సమాచారం.