Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం కుర్చి కోసం రూ. 50 కోట్లు పెట్టుబడి, ఇద్దరు మంత్రుల హల్ చల్, బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ !

హెబ్బళి/బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చి కోసం ఆశ పడుతున్న మంత్రులు డీకే. శివకుమార్, ఎంబీ. పాటిల్ శాసన సభ ఉప ఎన్నికల్లో వారి పార్టీ అభ్యర్థులు గెలుపొందడం కోసం ఒక్కొక్కరు రూ. 50 కోట్లు ఖర్చు పెడుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఆరోపించారు.

ముఖ్యమంత్రి కావాలనే ఆశతోనే ఇద్దరు మంత్రులు కుందగోళ, చించోళి శాసన సభ నియోజక వర్గం ఇన్ చార్జ్ లుగా పని చేస్తూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఇద్దరు మంత్రుల మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

Lok Sabha elections 2019: Renukacharya says in Hubballi alleged Rs 50 crore invested for CM post

కుందగోళ్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో డబ్బు పంపణి చెయ్యడానికి మంత్రి డీకే. శివకుమార్ బెంగళూరు నుంచి 500 మంది అనుచరులను పిలిపించారని బీజేఎమ్మెల్యే రేణుకాచార్య ఆరోపించారు. కుందగోళ్ ఉప ఎన్నికల ప్రచారం భాద్యతలు తీసుకున్న మంత్రి డీకే. శివకుమార్ అభివృద్ది గురించి ఏమీ మాట్లాడటం లేదని రేణుకాచార్య ఆరోపించారు.

మూడు సంవత్సరాల క్రితం మంత్రి డీకే. శివకుమార్ హరకుణి ప్రాంతంలో నిరంతర జ్యోతి పథకంకు శంకుస్థాపన చేశారని, ఈ రోజు ఆ ప్రాంతంలో వెలుగు లేకుండా పోయిందని రేణుకాచార్య ఆరోపించారు. డీకే. శివకుమార్ లాంటి అవినీతి మంత్రిని తాను ఇంత వరకూ చాడలేదని బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+