ఈసి విభజన: ఎన్నికలు టిలో, సీమాంధ్రలో వేర్వేరుగా
మొత్తం తొమ్మిది విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 30న ఏడో విడత, మే 7న ఎనిమిదో విడత జరగనున్నాయి. ఏడో విడతలో తెలంగాణ ప్రాంతంలో, ఎనిమిది విడతలో సీమాంధ్ర ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల ఉంటుంది.
తెలంగాణలో ఎన్నికల కోసం ఏప్రిల్ 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 9 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన. 12న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్ 30న ఎన్నికలు ఉంటాయి.
సీమాంధ్రలో ఎన్నికల కోసం ఏప్రిల్ 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న. ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 23. మే 7న ఎన్నికలు ఉంటాయి.
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాలు, సీమాంధ్రలో 25 లోకసభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.