ఆమెకు డజను మందికి పైగానే మొగుళ్లు.. ఉండేది గంట మాత్రమే!
పెళ్లి అంటే ప్రతి ఒక్కరికి జీవితాంతం గుర్తుండిపోయే వేడు.. జీవితకాల ప్రయాణానికి తొలి అడుగు. మూడూ ముళ్లు ఏడడుగులతో ఇద్దరు ఒక్కటయ్యే అద్భుతమైన సందర్భం. కానీ ఓ మహిళ నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా పెళ్లిళ్ల పేరుతో ముందుకు సాగుతూనే ఉంది. రాణి కుమారి అనే ఓ మహిళ పెళ్లి పేరుతో డజనుకు పైగా పురుషుల జీవితాలను నాశనం చేసింది. పెళ్లైన కొన్ని గంటలకే నూతన వధువుగా.. వధువుగా వెళ్లాల్సిన సమయంలో దోపిడి దొంగలా మారి అందినకాడికి నగదు, ఆభరణాలు దోచుకుని అక్కడి నుంచి మాయమవుతుంది. ఎట్టకేలకు ఈ దోపిడీ దొంగ పెళ్లి కూతురికి, ఆమెకు సహకరించిన భర్త, తల్లితో సహా మొత్తం గ్యాంగ్ను సోన్భద్ర పోలీసులు అరెస్ట్ చేసి ఈ మోసాల పరంపరకు అడ్డుకట్ట వేశారు.
కొన్ని గంటల్లోనే మాయమయ్యే 'రాణి కుమారి' మోసాలు
వారణాసి కేంద్రంగా పనిచేసిన ఈ గ్యాంగ్ పెళ్లిళ్లు చేసుకోని లేదా ఇబ్బందుల్లో ఉన్న పురుషులను లక్ష్యంగా చేసుకుంది. రాణి కుమారి అలియాస్ 'లూటేరీ దుల్హన్' డజనుకు పైగా పెళ్లిళ్లు చేసుకుంది. ప్రతి వివాహం ఆమెకు కొన్ని గంటలు లేదా గరిష్టంగా ఒక రోజు మాత్రమే ఉండేది. పెళ్లైన వెంటనే లేదా కొన్ని గంటల తర్వాత, ఆమె ఇంట్లో ఉన్న నగదు, విలువైన వస్తువులతో ఎవరికీ అనుమానం రాకుండా పారిపోయేది. ఈ మోసాల వెనుక రాణి కుమారితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, ఇతర సభ్యులతో కూడిన ఒక వ్యవస్థీకృత గ్యాంగ్ పనిచేసేది. వీరు అమాయక కుటుంబాలను నకిలీ వివాహాల ద్వారా వలలో వేసేవారు.

నగదు, నగలు స్వాధీనం.. గ్యాంగ్ అరెస్ట్
సోన్భద్ర పోలీసులు పక్కా సమాచారంతో ఈ గ్యాంగ్ను ఛేదించారు. సోన్భద్ర ఎస్పీ అభిషేక్ వర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 6-7 తేదీల్లో పోలీసులు చేపట్టిన కఠిన చర్యలలో రాణి కుమారితో పాటు ఆమె భర్త రవి రంజన్ మౌర్య, ఈ మోసాలకు పూర్తి సహకారం అందించిన ఆమె తల్లి మాయాలను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి దొంగిలించబడిన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.9,500 నగదు, బంగారం, వెండి ఆభరణాలు, అలాగే పెళ్లికి సంబంధించిన దుస్తులు ఉన్నాయి.
యూపీ-జార్ఖండ్ సరిహద్దులో కీలక పాత్రధారి అరెస్ట్
అరెస్టు చేయబడిన ప్రధాన నిందితుల విచారణలో ఈ గ్యాంగ్లో పాలుపంచుకున్న మరికొందరి పేర్లు బయటపడ్డాయి. ప్రధాన నిందితుల సమాచారం ఆధారంగా పోలీసులు ఒక రోజు తరువాత గ్యాంగ్లో కీలక సభ్యుడైన కృష్ణానంద్ మౌర్యను అదుపులోకి తీసుకున్నారు. మ్యోర్పూర్ ఎస్ఓ కమల్ నయన్ దూబే అందించిన సమాచారం మేరకు.. అధికారులు కృష్ణానంద్ను ఉత్తరప్రదేశ్-జార్ఖండ్ సరిహద్దులో చుట్టుముట్టారు.అతని వద్ద నుంచి భారీగా రూ.90,000 నగదు, ఈ మోసాలకు ఉపయోగించిన ఒక ఎస్యూవీ (SUV) వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణానంద్ మౌర్య ఈ గ్యాంగ్లో కీలకంగా వ్యవహరించాడని, అమాయక కుటుంబాల నుంచి మోసపూరిత వివాహాల ద్వారా డబ్బు, విలువైన వస్తువులను లాగడంలో చురుకైన పాత్ర పోషించాడని అధికారులు ధ్రువీకరించారు. ఈ గ్యాంగ్ నకిలీ వివాహాలను ఒక దందాగా మార్చి, అనేక మందిని మోసగించింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications