ట్రయాంగిల్ లవ్: వ్యక్తి ప్రాణం తీసిన అక్రమ సంబంధం
బెంగుళూరు: అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో తన స్నేహితుడు సన్నిహితంగా ఉండటాన్ని చూసి ఓర్వలేని ఓ వ్యక్తి మరో ఇద్దరితో కలిసి అతడిని అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ ఘటన బెంగుళూరులని హెచ్ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం కార్తీక్, హర్ష స్నేహితులు. బెంగుళూరులో నగరంలోని ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో హర్ష పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న కసవనహల్లి ప్రాంతంలో నివసిస్తున్నాడు. కాగా కార్తీక్కు పెళ్లి అయినప్పటికీ ఓ మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
ఆ మహిళ కార్తీక్తో పాటు హర్షతో పాటు సన్నిహితంగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయిన కార్తీక్ తన స్నేహితులతో కలిసి మార్చి 13వ తేదీన అతడిని హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. హర్షను ఓ పథకం ప్రకారమే హత్య చేయాలని నిర్ణయించుకున్న కార్తీక్ ముందుగానే తన స్నేహితులైన సంతోష్, సంజు కూమార్లకు వివరించాడు.
హర్షను ఇంటి నుంచి ఆటోలో ఎక్కించుకున్న కార్తీక్ కసవనహల్లికి సమీపంలోని శ్రీ క్రిష్ఠప్ప లేఔట్కు రాగానే హర్షను ఆటోలో నుంచి బయటకు దింపి అతడిపై ఇనుపరాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని సర్జాపూర్కు సమీపంలోని ముగలూరు సరస్సులో పడేశారు.
ఇదే సమయంలో అటుగా వెళ్తోన్న ఓ ప్రత్యక్ష సాక్షి సరస్సులోకి గోనె సంచిని విసిరివేయడాన్ని చూసి మరుసటి రోజు ఉదయం హెచ్ఎస్ఆర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.