‘‘ఇంటికెళ్లి వస్తామంటే కుదరదు.. ఇప్పుడే.. ఇక్కడే ఇవ్వాలి, ఇస్తేనే ఆపరేషన్ చేస్తా’’
మల్కన్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఒక వైద్యుడు మానవత్వం మరిచి ప్రవర్తించాడు. నెలలు నిండి ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చిన ఓ గిరిజన యువతికి ఆపరేషన్ చేసేందుకు రూ. ఐదు వేలు లంచం డిమాండ్ చేశాడు.
భువనేశ్వర్: మల్కన్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఒక వైద్యుడు మానవత్వం మరిచి ప్రవర్తించాడు. జిల్లాలోని ఖోయిరాపుట్ సమితి బొండాంఘాట్లోని మందిలిపొడియా గ్రామంలోని బొండా తెగకు చెందిన గిరిజన మహిళ గురుసీసా రెండోసారి గర్భం దాల్చింది.
ఆమె కడుపులో కవలలు ఉన్నట్టు గ్రామంలో మంత్రసాని తెలిపింది. నెలలు నిండిన ఆమెను ప్రసవం కోసం మంగళవారం ఆమె భర్త, తమ్ముడు మల్కన్గిరి ఆస్పత్రికి తీసుకువచ్చారు.
ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యుడు నిర్మల్నాయక్ ఆమెను పరీక్షించి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పాడు.

ఆపరేషన్ చేసేందుకు రూ. ఐదువేలు లంచం ఇవ్వాలని అతడు షరతు విధించడంతో ఏం చేయాలో తోచక గర్భిణితో పాటు భర్త, సోదరుడు అరగంట సేపు అలానే ఉన్నారు. గురుసీసాకు చికిత్స అందించమని వేడుకున్నా నిర్మల్ నాయక్ మనసు కరగలేదు.
'కనీసం రూ.మూడు వేలు అయినా ఇవ్వండి. ఇంటికెళ్లి వస్తామంటే ఊరుకోను.. ఇక్కడే, ఇప్పుడే డబ్బు ఇవ్వాలి..' అంటూ అతడు తెగేసి చెప్పడంతో గురుసీసా తమ్ముడు అక్కడ ఎవరినో అడిగి రెండు వేల రూపాయలు తెచ్చి ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకున్న తరువాతే వైద్యుడు నిర్మల్ నాయక్ ఆమెకు ఆపరేషన్ చేశాడు.
పిల్లలు ఇద్దరూ క్షేమంగా పుట్టారు కానీ తక్కువ బరువు ఉండడంతో పిల్లలను ఐసీయూలో పెట్టారు. అయితే మిగతా మూడు వేలు ఇస్తేనే పిల్లలను అప్పగిస్తామని మళ్లీ డాక్టర్ నిర్మల్ నాయక్ తేల్చిచెప్పాడు. పైపెచ్చు 'డబ్బు ఇవ్వకపోతే పిల్లలు చనిపోయారని సర్టిఫికెట్ ఇస్తా..' అంటూ వారిని బెదిరించాడు.
స్పందించిన ఎమ్మెల్యే
దీంతో గురుసీసా భర్త వెంటనే మల్కన్గిరి ఎమ్మెల్యే మనాస్మడకామిని కలిసి విషయం తెలియజేశాడు. ఎమ్మెల్యే వెంటనే ఆస్పత్రికి చేరుకుని.. సీడీఎంఓ ఉదయ్ చంద్రమిశ్రా, ఎడీఎం రఘుమణి గొమాంగోలతో కలిసి ప్రసూతి వార్డుకు వచ్చి గురుసీసాను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. అలాగే పిల్లలను పరిశీలించారు.
సీడీఎంఓ ఉదయ్ చంద్ర మిశ్రో వెంటనే వైద్యుడు నిర్మల్నాయక్ను ఆ వార్డులో విధుల నుంచి తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మల్నాయక్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
'కలెక్టర్ అందుబాటులో లేరు. ఆయన వస్తే వైద్యుడ్ని సస్పెండ్ చేయిస్తాం..ఇకపై ఎక్కడా ఇలా ప్రవర్తించకుండా చేస్తాం..' అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మానాన్మాడకమి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అందాల్సిన పథకాలన్నీ త్వరలోనే గురుసీసాకు అందజేసి వైద్యునిపై చర్య తీసుకుంటామని చెప్పారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications