కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు నమ్మొద్దు: స్టాలిన్, ఇంట్లోనే చికిత్స, పరామర్శించిన పన్నీరుసెల్వం
Recommended Video

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి ఆరోగ్యంపై రాష్ట్రంలో వదంతులు చెలరేగుతున్నాయి. కరుణానిధి జ్వరంతో బాధపడుతుండగా, ఆయన ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వచ్చాయి. దీంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కరుణానిధి కుమారుడు, డీఎంకే నేత స్టాలిన్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. కరుణానిధి అనారోగ్యంగా ఉన్నారంటూ వచ్చిన వార్తలు అబద్ధమని, ఆయన బాగున్నారని స్టాలిన్ తెలిపారు. వదంతులను నమ్మవద్దని చెప్పారు. వైద్యుల సలహా మేరకు ఆయన మరికొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి వుందని, ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు.

కార్యకర్తలు, పార్టీ నేతలు ఎవరూ గోపాలపురం (కరుణానిధి ఇంటి ప్రాంతం) రావద్దని సూచించారు. ఆయన కేవలం స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసిన కుటుంబ వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు.
కరుణానిధి జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు హెల్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, పలువురు మంత్రులు, రాజకీయ నేతలు కరుణానిధిని పరామర్శించారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications