దినకరన్ కు ఎగ్మోర్ కోర్టు నోటీసులు, కారణమిదే!
అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ కు మద్రాస్ కోర్టు నోటీసులు జారీ చేసింది.ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
చెన్నై:అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ కు మద్రాస్ కోర్టు నోటీసులు జారీ చేసింది.ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆర్ కె నగర్ ఉప ఎన్నికల బరిలో బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో విపరీతంగా డబ్బు పంపిణీచేశారనే ఆరోపణలతో ఈ ఉప ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.
మరో వైపు ఫెరా నిబంధనలను ఉల్లంఘించారని దినకరన్ కు మద్రాస్ కోర్టు గురువారం నాడు నోటీసులు జారీచేసింది.ఈ నెల 18, 19 తేదిల్లో కోర్టుకు హజరుకావాలని కోర్టు ఆదేశించింది.
ఆర్ కె నగర్ ఉప ఎన్నికల నామినేషన్ స్కృూట్నీ సమయంలో కూడ ఫెరా నిబంధనలను దినకరన్ ఉల్లంఘించారని డిఎంకె, పన్నీర్ సెల్వం గ్రూపులు దినకరన్ పై ఫిర్యాదు చేశాయి.అయితే ఈ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఆయన నామినేషన్ సక్రమమేనని ఎన్నికల అధికారి ప్రకటించారు.