మహారాష్ట్రలో డబుల్ మ్యూటేషన్ వైరస్ టెన్షన్ ... ఎన్ఐవి టెస్ట్ చేసిన 61% నమూనాలలో అదే ,మహా సంక్షోభం
కరోనా
సెకండ్
వేవ్
భారతదేశంలో
తన
విజృంభణ
కొనసాగిస్తోంది.
ఇదే
సమయంలో
కరోనా
వేరియంట్లు
ఆందోళన
కలిగిస్తున్నాయి.
ఇటీవల
18
రాష్ట్రాల్లో
సేకరించిన
శాంపిల్
లలో
ఒక
డబుల్
మ్యూటేషన్
వేరియంట్
కనిపించినట్లుగా
తెలుస్తుంది.
ఇక
తాజాగా
పూణేలోని
నేషనల్
ఇన్స్టిట్యూట్
ఆఫ్
వైరాలజీ
(ఎన్ఐవి)
మహారాష్ట్రలోని
ప్రయోగశాలలతో
డేటాను
పంచుకుంది,
జనవరి
నుండి
మార్చి
వరకు
మహారాష్ట్రలో
తీసిన
361
కోవిడ్
-19
నమూనాలు
మరియు
జన్యు
క్రమం
ప్రకారం,
61%
డబుల్
మ్యూటేషన్
వైరస్
ఉన్నట్టు
గుర్తించింది
.
220 మందికి డబుల్ మ్యుటేషన్ E484Q మరియు L452R కలిసి ఒక మ్యూటెంట్ గా
మొత్తం నమూనాలలో 220 మందికి డబుల్ మ్యుటేషన్ E484Q మరియు L452R కలిసి ఉన్నట్టు వైరాలజీ ల్యాబ్ నిర్ధారించింది . ఇప్పుడు ఇది B.1.617 వంశంగా వర్గీకరించబడింది.
మార్చి 24 న, మహారాష్ట్రలో 15-20% నమూనాలలో డబుల్ మ్యూటాంట్ వేరియంట్ను కనుగొన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, కాని ఈ వేరియంట్ను రాష్ట్రంలో సెకండ్ వేవ్ తో అనుసంధానించలేదు. ఏప్రిల్ 10 న జరిగిన సమావేశంలో ఎన్ఐవి అధికారులు డబుల్ మ్యూటేషన్ వైరస్ పై వివరించారు .
జీనోమ్ సీక్వెన్సింగ్పై సమగ్ర నివేదికను కోరిన రాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్రలోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ డ్రగ్స్ విభాగం ఆధ్వర్యంలో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టరేట్ ఈ సమావేశాన్ని నిర్వహించింది.
ప్రెజెంటేషన్లో జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలను వెల్లడించారని , దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా లిఖితపూర్వక నివేదిక రాలేదని అధికారులు తెలిపారు. అన్ని మహారాష్ట్ర నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్పై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు.
మహారాష్ట్ర రెండవ తరంగంలో డబుల్ వేరియంట్ పాత్రను తోసిపుచ్చలేమని రాష్ట్ర ఆరోగ్య అధికారులు చెప్తున్నారు .
డబుల్ మ్యూటేషన్ డేంజరస్ నా ? భయం గుప్పిట్లో మహారాష్ట్ర
రాష్ట్రం ప్రతిరోజూ 50,000 లకు పైగా కొత్త కేసులను నమోదు చేస్తోంది . 5.64 లక్షల క్రియాశీల కేసులను కలిగి ఉంది. ఇది భారతదేశ కోవిడ్ కేసుల భారంలో సగం . మ్యుటేషన్ ప్రమాదకారినా , కాదా , ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది అని వారు కేంద్రాన్ని అడిగినట్లు అధికారులు తెలిపారు. అయితే వ్యూహాన్ని మార్చాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొందని మహారాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ ప్రదీప్ వ్యాస్ అన్నారు.
ఎన్ఐవి డైరెక్టర్ డాక్టర్ ప్రియా అబ్రహం దీనిపై స్పందించడానికి నిరాకరించారు.
మూడు నెలలుగా నమూనాలు సేకరించి పరిశీలించిన ఎన్ఐవి
జనవరిలో, డబుల్ మ్యూటెంట్ వేరియంట్ B.1.617 మొదట అకోలాలో మూడు నమూనాలలో మరియు థానేలో ఒక నమూనాలో కనిపించిందని ఎన్ఐవి డేటా చూపిస్తుంది. ఫిబ్రవరిలో అకోలా, అమరావతి, భండారా, హింగోలి, గోండియా, చంద్రపూర్, నాగ్పూర్, పూణే, వార్ధా మరియు యావత్మల్ సహా 13 జిల్లాల్లో 50% కంటే ఎక్కువ నమూనాలలో ఈ మ్యూటేషన్ గుర్తించారు. ఇక తాజాగా మార్చిలో ప్రతి జిల్లా నుండి 10 నుండి 30 నమూనాలను సేకరించి , ఔరంగాబాద్, ముంబై, జల్నా, పాల్ఘర్, నాందేడ్ నుండి సేకరించిన నమూనాలలో, రెండు నుండి 14 నమూనాలు ఈ వేరియంట్ను కలిగి ఉన్నాయి.
రెండు మ్యూటేషన్ వైరస్ లు కలిసి ఒకటిగా మరో కొత్త మ్యూటేషన్
B.1.617
స్పైక్
ప్రోటీన్,
E484Q
మరియు
L452R
లో
రెండు
ఉత్పరివర్తనాలను
కలిగి
ఉంటుంది.
E484Q
రోగనిరోధక
ప్రతిస్పందనను
దాటవేయగల
సామర్థ్యాన్ని
కలిగి
ఉంది
మరియు
L452R
కూడా
తప్పించుకునే
మ్యుటేషన్.
తక్కువ
వైరస్
ఉన్నప్పటికీ,
రెండూ
కలిసి
ఎక్కువ
వ్యాప్తి
చేసే
అవకాశం
ఉన్నట్టు
తెలుస్తుంది
.
ఇక
డబుల్
మ్యూటేషన్
ల
కేసులతోనూ
భారత్
లో
దారుణమైన
పరిస్థితులు
నెలకొనే
ప్రమాదం
కనిపిస్తుంది
.