మహాసంక్షోభం - షిండే క్యాంపులోక 14 మంది ఎంపీలు ? త్వరలో ముంబైకి రిటర్న్
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేనతో పాటు మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో తలెత్తిన తిరుగుబాటు రోజుకో ములుపు తిరుగుతోంది. ఇప్పటికే శివసేనకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు షిండే క్యా్ంపుకు చేరిపోగా.. ఇప్పుడు ఎంపీలు కూడా అదే బాట పట్టారు. శివసేనకు పార్లమెంటులో 19 మంది ఎంపీలున్నారు.
శివసేనకు పార్లమెంటులో ఉన్న 19 మంది ఎంపీల్లో 14 మంది ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు షిండే క్యాంపు తమకు మెజార్టీ ఎంపీల మద్దతు ఉన్నట్లు ప్రకటించుకుంది. దీంతో శివసేనలో భారీ చీలిక ఖాయంగా కనిపిస్తోంది. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో ఇప్పటికే గౌహతిలో రెబెల్ క్యాంప్ నిర్వహిస్తున్న షిండే ఇప్పుడు ఎంపీల్ని కూడా అక్కడికి రప్పించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మరోవైపు సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలు తమ అనర్హత నోటీసులపై వచ్చేనెలలో సమాధానం ఇవ్వాల్సి ఉంది. అప్పటిపరకూ వారు గౌహతి వీడి ముంబయికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కానీ త్వరలో తాను ముంబైకి తిరిగి వస్తానని ఏక్ నాధ్ షిండే చెప్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో సీఎంఉద్ధవ్ థాక్రే అత్యవసర కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఇది ముగిశాక సాయంత్రం మరోసారి పార్టీ నేతలతో సమావేశమై కీలక నిర్ణయం ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరువర్గాల అడుగులు ఆసక్తి రేపుతున్నాయి.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications