Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘మహాత్ముడి’ స్కూల్‌ మూసివేత.. 164 ఏళ్ల చరిత్ర.. ఇక మ్యూజియంగా..

జాతిపిత మహాత్మాగాంధీ విద్యాభ్యాసం చేసిన ఆల్ప్రెడ్ హైస్కూల్‌ మూతపడింది. దాదాపు 164 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాల ఇకమీదట ప్రదర్శన శాలగా మారనుంది.

రాజ్‌కోట్‌: జాతిపిత మహాత్మాగాంధీ విద్యాభ్యాసం చేసిన ఆల్ప్రెడ్ హైస్కూల్‌ మూతపడింది. దాదాపు 164 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాలను ఖాళీ చేశారు. ఇక ముందు నుంచి ఈ పాఠశాల ప్రదర్శన శాల(మ్యూజియం)గా మారనుంది.

బ్రిటీషు పరిపాలన కాలంలో 1853 అక్టోబర్‌ 13న ఈ పాఠశాలను స్థాపించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో ఇదే మొట్టమొదటి ఆంగ్ల మాధ్యమ పాఠశాల. ప్రస్తుతం ఉన్న భవన సముదాయాన్ని జునాఘడ్‌ నవాబ్‌ 1875లో నిర్మించాడు. ఆయనే ఆ పాఠశాలకు ఆల్ప్రెడ్ హైస్కూల్‌ అని పేరు పెట్టారు.

అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనిని.. మోహన్‌దాస్‌ గాంధీ హైస్కూల్‌ గా పేరు మార్చి పిలవడం మొదలుపెట్టారు. గుజరాత్‌ ప్రభుత్వం నడుపుతున్న ఈ పాఠశాలను మ్యూజియంగా మార్చాలని గత ఏడాదే ప్రతిపాదన వచ్చింది. 1887లో గాంధీజీ ఈ పాఠశాల నుంచి ఉత్తీర్ణుడిగా బయటకొచ్చారు. అప్పుడాయన వయసు 18 సంవత్సరాలు.

Mahatma Gandhi’s Rajkot school Alfred High shuts down after 164 years

మ్యూజియంగా మార్చే ఆలోచన రాగానే ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న 125 మంది విద్యార్థులకు బదిలీ ధ్రువపత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ మధ్యనే ప్రారంభించారు. 'ఇప్పటి వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులకు బదిలీ ధ్రువపత్రాలు ఇస్తున్నాం.. వచ్చే ఏడాది నుంచి వీరు తమకు నచ్చిన పాఠశాలలో చదువుకోవచ్చు.. ' అని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.

రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ పాఠశాలను మూసివేసి మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదనను పాఠశాల శాఖ అధికారులకు అందజేయడంతో దానికి ఆమోదం లభించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+