మకరజ్యోతి దర్శనం, స్వామియో శరణమయ్యప్ప నినాదాలతో మార్మోగిన శబరిగిరులు
శబరిమల: శబరిమలలో అయ్యప్ప స్వామి వారు మకరజ్యోతి రూపంలో దర్శనం ఇచ్చారు. మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప మాలధారణ వేసినవారు, ఇతర భక్తులు పోటెత్తారు. పంబానది, సన్నిధానం, హిల్టాప్, టోల్ ప్లాజా వద్ద మకరజ్యోతి దర్శనం కోసం ట్రావెన్కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.
పొన్నంబలమేడు నుంచి భక్తలకు దర్శనం ఇచ్చారు. శబరిగిరులు స్వామియే శరణం అయ్యప్ప స్వామి అనే నినాదాలతో మారుమోగాయి. భక్తులు ఈ నెల 19వ తేదీ వరకు అయ్యప్ప స్వామివారిని దర్శించుకునే వీలు ఉంది. 20వ తేదీన పందళ రాజవంశీకులు స్వామి దర్శనం అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.













Click it and Unblock the Notifications