టెన్త్ పాస్ అయితే చాలు నెలకు రూ.1500-ఖాతాల్లో జమ ప్రారంభం..!
పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ (mamata Banerjee)ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల వేళ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్న నిరుద్యోగ యువతకు మేలు చేసేలా యువ సాథీ (yuva sathi) పేరుతో ఓ కొత్త పథకాన్ని ఇవాళ ప్రారంభించారు. అసలే ఈసారి అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని భావిస్తున్న తరుణంలో నిరుద్యోగుల్ని లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన ఈ పథకాన్ని ఇవాళ్టి నుంచే అమల్లోకి కూడా తెచ్చేశారు.
రాష్ట్రంలో పదో తరగతి పాసై నిరుద్యోగులుగా ఉన్న 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల యువతకు నెలకు 1500 చొప్పున ప్రభుత్వం చెల్లించేలా యువ సాథీ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని భావించిన ప్రభుత్వం.. ఎందుకైనా మంచిదని ఇవాళ్టి నుంచే అమల్లోకి కూడా తెచ్చేసింది. దీంతో నిరుద్యోగుల ఖాతాల్లో డబ్బుల జమ కూడా ప్రారంభమైంది. ఈ పథకం ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలో నిరుద్యోగంపై సీం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.

తన ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం 40 శాతం తగ్గిందని మమతా బెనర్జీ వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం 40 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ కూడా అందించిందని ఆమె గుర్తుచేశారు. వారిలో 10 లక్షల మంది ఇప్పటికే ఉపాధి కూడా పొందుతున్నారని మమత తెలిపారు. రాష్ట్రంలో ఐటీ సహా పలు రంగాల్లో పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటే ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. అయితే కేవలం 10వ తరగతి మాత్రమే పాసైన నిరుద్యోగులకు ఈ ఉద్యోగాలు రావన్న బాధ లేకుండా యువ సాధీ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మమత వెల్లడించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications