మమత ఢిల్లీ టూర్ సక్సెస్-పవార్, సోనియాతో మంత్రాంగం- తరచుగా వస్తానన్న దీదీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తోనూ ఆమె వరుసగా భేటీలు నిర్వహించారు. వీటిలో విపక్షాల ఐక్యతపై ఆమె చర్చలు జరిపారు. ఇవి విజయవంతం కావడంతో త్వరలో మరిన్ని పర్యటనలు ఉంటాయని దీదీ సంకేతాలు ఇచ్చారు.
ఇకపై రెండునెలలకోసారి ఢిల్లీలో పర్యటిస్తానని మమతా బెనర్జీ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరింత మంది విపక్ష నేతల్ని కలిసి ఏకతాటిపైకి తెస్తానని వెల్లడించారు. తన తాజా ఢిల్లీ పర్యటన సంతోషాన్నిచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని పర్యటనలు ఉంటాయని ఆమె సంకేతాలు ఇచ్చారు. 2024 ఎన్నికల వ్యూహంపై ప్రశ్నించగా.. అందరి లక్ష్యం దేశాన్ని కాపాడటమే అని దీదా వెల్లడించారు. దేశం అభివృద్ధి చెందాలని, మన ప్రజలకు అభివృద్ధి అవసరమని మమత తెలిపారు. పెట్రో ధరలతో పాటు అన్ని ధరలు పెరుగుతున్న కోవిడ్ మూడో దశ ముప్పుపై ఆమె కేంద్రానికి హెచ్చరికలు చేశారు.

తన ఐదు రోజుల ఢిల్లీ పర్యటనలో మమతా బెనర్జీ సోనియా, రాహుల్, పవార్, కేజ్రివాల్ తో పాటు మరికొందరు విపక్ష నేతల్ని కలుసుకుని సుదీర్ఘ చర్చలు జరిపారు. అదే సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతోనూ మమత భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోడీతో విభేదిస్తారని పేరున్న గడ్కరీని మమత కలవడం చర్చనీయాంశమైంది. సోనియాతో జరిగిన చర్చలపై స్పందించిన మమత... దేశంలో తాజా రాజకీయ పరిస్ధితులతో పాటు గాంధీలతో కూడిన విపక్ష కూటమి ఏర్పాటుపై చర్చించానన్నారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
రాష్ట్రపతికి అవమానం? దీదీ వర్సెస్ ఢిల్లీ -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
టెన్త్ పాస్ అయితే చాలు నెలకు రూ.1500-ఖాతాల్లో జమ ప్రారంభం..! -
AAHAR 2026 : 40 ఏళ్ల ప్రయాణం- ఆసియాలో అతిపెద్ద ఫుడ్ & హాస్పిటాలిటీ ఫెయిర్ -
AAHAR 2026: మార్చి 10 నుంచి ఢిల్లీలో భారీ ఫుడ్ ఎగ్జిబిషన్..!! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..!












Click it and Unblock the Notifications