సీఆర్పీఎఫ్పై మమత వ్యాఖ్యలపై ఈసీ సీరియస్- రేపటిలోగా వివరణ కోరుతూ నోటీసులు
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారా స్దాయికి చేరుకుంటోంది.. ఇందులో కేంద్ర బలగాలు సైతం విమర్శల పాలవుతున్నాయి. బీజేపీ కేంద్ర బలగాల సాయంతో ఓటర్లను భయపెట్టి ఓట్లు వేయించుకుంటోందంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు ఇప్పుడు కొత్త వివాదానికి ఆజ్యం పోశాయి.
కేంద్ర బలగాల్ని టార్గెట్ చేస్తూ మమతా బెనర్జీ పదే పదే చేస్తున్న విమర్శలపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం మమతా బెనర్జీకి నోటీసులు జారీ చేసింది. మమత వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన నింపేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఈసీ నోటీసులో పేర్కొంది. తాజాగా సీఆర్పీఎఫ్ను దిగ్బంధించండి అంటూ కూచ్బెహార్ ర్యాలీలో మమత చేసిన వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని నోటీసులో ఈసీ తెలిపింది.

Recommended Video
మార్చి 28న ఓ టీవీ ఇంటర్వ్యూలో మమత చేసిన వ్యాఖ్యలతో పాటు ఏప్రిల్ 7న కూచ్బెహార్ ర్యాలీలో చేసిన కామెంట్లను పరిగణనలోకి తీసుకుని నోటీసులు జారీ చేసినట్లు ఈసీ వెల్లడించింది. మమత వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిలోని సెక్షన్ 186, 189,504కింద శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నట్లు ఈసీ తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ సీఎంను ఈసీ ఆదేశించింది. ఏప్రిల్ 10లోగా మమత వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications