ఫోన్ కనెక్షన్ తీసేసినా పర్లేదు, ఆధార్తో లింక్ చేయను: మమతా బెనర్జీ
ఫోన్ నెంబర్ను ఆధార్ కార్డుతో లింక్ చేయాలన్న కేంద్రం నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోల్కతా: ఫోన్ నెంబర్ను ఆధార్ కార్డుతో లింక్ చేయాలన్న కేంద్రం నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: భారత్ ఆందోళనను పట్టించుకోని చైనా, కీలక నిర్ణయం: మరింత దూరం
తన ఫోన్ నంబర్ను ఆధార్తో అనుసంధానం చేసుకునేది లేదని, కావాలంటే తన నంబర్ను కట్ చేసుకోవచ్చని చెప్పారు. తన ఫోన్ కనెక్షన్ తీసేసినా బాధ లేదని, ఇది వ్యక్తిగత విషయాలకు వ్యతిరేకం అన్నారు.

ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నంబర్కు ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయంపై పునరాలోచించాలని చాలామంది కోర్టులో పిటీషన్లు వేశారు. వీటిపై అక్టోబర్ 30న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది.












Click it and Unblock the Notifications