వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య కళ్ల ముందే తల నరికి నడి రోడ్డులో పెట్టారు

|
Google Oneindia TeluguNews

మదురై: హత్య కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో భార్య కళ్ల ముందే ఓ వ్యాపారి తల నరికి నడి రోడ్డు మీద పెట్టి వెళ్లిన సంఘటన తమిళనాడులోని మదురై సమీపంలో జరిగింది.

నీలకొట్టాయ్ ప్రాంతంలో అళగురాజా, తేను దంపతులు నివాసం ఉంటున్నారు. అళగురాజా మాంసం వ్యాపారం చేస్తున్నాడు. ఇతని ప్రత్యర్థి వ్యాపారి నాగేష్. కొన్ని వారాల ముందు నాగేష్ అల్లుడు హత్యకు గురైనాడు.

తన అల్లుడిని హత్య చేసిన వారిలో అళగురాజా ఉన్నాడని నాగేష్ పగ పెంచుకున్నాడు. ఇటీవల తిరుమంగళంలో మరణించిన బంధువు అంత్యక్రియలకు హాజరుకావడానికి అళగురాజా భార్య తేనుతో కలిసి వెళ్లాడు.

Man beheaded in public to avenge son-in-law’s murder in Tamil Nadu

అంత్యక్రియలు పూర్తి అయ్యాక సమీపంలోని దుకాణంలోకి వెళ్లారు. అదే సందర్బంలో నలుగురు వ్యక్తులు బైక్ ల మీద షాప్ దగ్గరకు వెళ్లారు. అళగురాజాను బయటకు లాగి అతని తల నరికి నడి రోడ్డులో పెట్టి వెళ్లిపోయారు.

ఈ దాడిలో అళగురాజా భార్య తేనుకు గాయాలైనాయి. తన భర్తను హత్య చేసిన వారిలో మా బంధువు ఒకరు ఉన్నారని తేను పోలీసులకు చెప్పింది. నడిరోడ్డు మీద తల ఉండటంతో స్థానికులు భయంతో హడలిపోయారు.

English summary
A man was brutally murdered in front of his wife and his head cut off and thrown on the road as revenge for another murder in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X