ఏడాది కాలంగా కూతురిపై తండ్రి అత్యాచారం, అరెస్ట్
పాల్ఘర్: మహారాష్ట్రలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. సభ్య సమాజం అసహ్యించుకునే ఉదంతం బయటకు వచ్చింది. ఏడాది పాటు తన కూతురిపై కన్నతండ్రే అత్యాచారం చేశాడు. వాసికి చెందిన 50 ఏళ్ల ఆ కిరాతకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారంనాడు చెప్పారు.
కొన్నేళ్ల క్రితం భార్య అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతను తన 15 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కుమారిడితో వాసిలోని ఆజాద్నగర్ మురికివాడలో నివసిస్తూ వస్తున్నాడు. మానిక్పురి పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎసి పాటిల్ ఈ విషయం చెప్పారు.
తన తండ్రి తనపై ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్నట్లు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్జీవోలో పనిచేసే ఓ మహిళ తమ ఇంటి పక్కన ఉంటుందని, ఆ ఎన్జీవో అమ్మాయిల సంరక్షణ కోసం పనిచేస్తుందని, ఆమె సహాయంతో తాను ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. గురువారం నాడు కేసు నమోదు చేసి, రాత్రి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసాఫీసర్ చెప్పారు.