కుట్ర చేసి, ప్రియుడితో భర్తను చంపించిన మహిళ
జమ్మూ: ఓ మహిళను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ ప్రభుత్వోద్యోగి హత్య కేసును ఛేదించారు. జమ్మూలోని ప్రజా ఆరోగ్య ఇంజనీర్ హత్యకు అతని భార్య, ప్రియుడు కారణమని పోలీసులు గుర్తించారు.
మే 23వ తేదీన కథువా జిల్లా బిల్లావర్కు చెందిన మొహ్మద్ ఇషాక్ శవం కనిపించింది. అనుమానాస్పద స్థితిలో చరాయ్ డగ్ వెల్లో ఆ శవం కనిపించింది. దర్యాప్తు సందర్భంగా అతని భార్యకు జోగీందర్తో అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు.
భార్య జోగీందర్తో కలిసి కుట్ర పన్ని తన భర్త కదలికల గురించి అతనికి తెలియజేస్తూ వచ్చింది. మే 23వ తేదీన తెల్లవారు జామున విధుల నుంచి తిరిగి వస్తుండగా, ఇషాక్ను జోగీందర్ అడ్డుకున్నాడు.
పదునైన ఆయుధంతో ఇషాక్పై అతను దాడి చేశాడు. అతని మెడ వెనక భాగంపై కొట్టాడు. ఆ తర్వాత రాళ్లతో కొట్టాడు. దాంతో ఇషాక్ అక్కడికక్కడే మరణించాడు. ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.