వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: ప్రేయసిని చంపి గదిలో పాతిపెట్టాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇండోర్: తనతో ఘర్షణకు దిగిన ప్రేయసిని చంపి ఇంట్లోనే శవాన్ని పాతిపెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పక్కింటి వ్యక్తితో గొడవ పడిన ఆ వ్యక్తి పొరపాటున మాట జారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నా ప్రియురాలిని చంపినట్టే నిన్ను చంపుతాను అని బెదిరించడంతో ఈ హత్య ఉదంతం ఆదివారంనాడు బయటపడింది.

ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గల చందన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాజోల్, ఘన్‌శ్యాం అనే ఇద్దరూ ప్రేమికులు. కొద్దిరోజుల క్రితం ఓ విషయంపై తీవ్రంగా గొడవపడ్డారు. కాజోల్ వాదనకు రెచ్చిపోయిన ఘన్‌శ్యాం ఆమెను పదునైన ఆయుధంతో తలపై కొట్టాడు. అక్కడిక్కడే మరణించిన ఆమెను ఇంట్లోనే పూడ్చిపెట్టాడు.

Man murders girlfriend, buries body in room

ఆ ప్రదేశంపైనే మంచం వేసుకొని మూడురోజులుగా నిద్రిస్తున్నాడు. శనివారం పొరుగింటి వ్యక్తితో జరిగిన గొడవ సందర్భంగా ఈ విషయం బయటకు పొక్కిందని చందన్‌నగర్ పోలీసులు తెలిపారు. ఇంట్లో సోదాల అనంతరం టైల్స్ కింద పూడ్చిపెట్టిన ఆమె మృతదేహాన్ని వెలికి తిశారు. నిందితుడు ఘన్‌శ్యాంను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఘన్‌శ్యాం తన వద్దకు వచ్చి అతని ప్రేయసి విషయంలో గొడవ పడ్డాడని, తన ప్రేయసిని సచిన్ అనే వ్యక్తికి తానే పరిచయం చేశానని, దానివల్ల వారిద్దరు మిత్రులయ్యారని తనపై గత కొద్ది రోజులుగా ఆగ్రహంతో ఉన్నాడని రిష్వత్ పోలీులకు చెప్పాడు.

English summary
A scuffle between two persons over a girl on Saturday morning led to a revelation which left the residents of Sahyog Nagar shocked. They came to know that a neighbourhood girl had been murdered and buried at the house of one Ghanshyam Ahirwar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X