నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి..? గొంతుకోసి హత్య... మనోవేదనతో తండ్రి బలవన్మరణం..
2021లో మృగాళ్లలో మార్పు రావడం లేదు. పసిపాపలపై కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. తమ కామవాంఛ కోసం వేధిస్తున్నారు. కాదు.. కూడదని అల్లరి చేస్తే అంతే నామరూపాలు లేకుండా చేస్తున్నారు. రోజు ఎక్కడో ఓ చోట దారుణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా దాద్రా నగర్ హవెలిలో దారుణం బహిర్గతమయ్యింది. ఓ యువకుడు నాలుగేళ్ల చిన్నారిని కడతేర్చాడు.
దాద్రానగర్ హవెలిలో ఉంటోన్న 30 ఏళ్ల యువకుడు... చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. చిన్నారి నిరాకరించడంతో గొంతుకోశాడు. తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. తర్వాత వాటిని తన ప్లాట్లో గల టాయిలెట్లో పడవేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన మరునాడు చిన్నారి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. చిన్నారికి చనిపోయిన తీరును చూసి కుమలిపోయి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

నారొలి గ్రామంలో గల తన ఇంటి బయట చిన్నారి ఆడుకుంటుండగా.. సంతోష్ రాజత్ కన్నుపడింది. ఆమెను తన అపార్ట్మెంట్కి తీసుకెళ్లి రేప్ చేసే యత్నం చేశారు. వెంటనే ఆమె ఏడవడంతో.. గొంతు కోశాడు. ముక్కలు చేసి.. టాయిలెట్ పక్కన పడవేశాడు. కూతురు కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. చిన్నారి ఉండే 40 ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. అయితే ఓ బాత్ రూం వద్ద రక్తపు మరకలు పోలీసులు కనుగొన్నారు.
నిందితుడి స్వస్థలం జార్ఖండ్లో గల ధాన్బాద్ అని పోలీసులు తెలిపారు. దాద్రా నగర్ హవెలిలో గత నాలుగేళ్ల నుంచి నివసిస్తున్నారని తెలిపారు. వివిధ ప్యాక్టరీల్లో పనిచేసేవారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications