ఉగ్రదాడి: సీఎం భద్రతకు వెళ్తున్న 4గురు పోలీసులు మృతి
మణిపూర్ రాష్ట్రంలోని లోక్చావోలో గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారు.
లోక్చావో: మణిపూర్ రాష్ట్రంలోని లోక్చావోలో గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబి సింగ్ కార్యక్రమానికి భద్రత నిమిత్తం సిబ్బంది మోరహ్ నుంచి తెంగనౌపల్ జిల్లాకు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి తెగపడినట్లు సమాచారం.

పేలుడు పదార్థాలు, తుపాకులతో కాల్పులు జరిపి ఉగ్రవాదులు దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా హైఅలర్ట్ను ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications