గాలిలో చాపర్: 40 నిమిషాల తర్వాత తిరిగి పాట్నాకే.. మనోజ్ తివారీ సహా క్యాంపెయినర్స్.
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఆయా పార్టీల కోసం స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. బీజేపీ తరఫున ఎంపీ మనోజ్ తివారీ రంగంలోకి దిగారు. అతను సింగర్, యాక్టర్ అనే సంగతి తెలిసిందే. ఈశాన్య ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న తివారీ బీహర్ ప్రచారం కోసం హెలికాప్టర్లో బయల్దేరారు. అయితే పాట్నాలో వారి చాపర్ అత్యవసరంగా ల్యాండయ్యింది.
చాపర్ కమ్యూనికేషన్ ఇబ్బంది రావడంతో పాట్నాలో గల జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగింది. తివారీతోపాటు నీలాకాంత్ బక్షీ, బీజేపీ నేతలు ఉన్నారు. హెలికాప్టర్ ల్యాండవడంతో అందులో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. చంపారన్ జిల్లాలో గల బెట్టియాలో ప్రచారంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి తివారీ బృందం బయల్దేరింది.

చాపర్ కమ్యూనికేషన్ లేదని.. 40 నిమిషాల పాటు వారిని ట్రేస్ చేయలేకపోయామని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. మా చుట్టూ లైట్లు మెరుస్తున్నాయని.. భూమికి దగ్గర వస్తోండటంతో.. ఫైలట్ పాట్నా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారని తెలిపారు. ఉదయం 10.10 గంటలకు పాట్నా నుంచి బయల్దేరామని.. బెట్టియాకు చేరుకుంటున్నామని అనుకుంటున్నామని అందులో ఉన్న వారు తెలిపారు. కానీ గాలిలో 40 నిమిషాలు ఎగిరిన తర్వాత తిరిగి పాట్నాకు రావడంతో.. సాంకేతిక సమస్య ఏర్పడిందని గ్రహించామని తెలిపారు. కానీ దేవుడి దయ వల్ల సురక్షితంగా ఉన్నామని చెప్పారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications