అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం: నలుగురు చిన్నారులతో సహా 14 మంది మృతి
జార్ఖండ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధన్బాద్లోని ఆశీర్వాద్ అపార్ట్మెంట్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధన్బాద్లోని ఆశీర్వాద్ అపార్ట్మెంట్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. కాగా, అపార్ట్మెంట్లో మొత్తం 400 మంది ఉన్నట్లు సమాచారం.
మొత్తం 13 అంతస్తులు ఉన్న ఈ అపార్ట్మెంట్ రెండో అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా అపార్ట్మెంట్ మత్తం వ్యాపించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైరింజిన్లతో మంటలు ఆర్పుతున్నారు.
సిలిండర్ పేలుడు కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Jharkhand | Visuals from outside Dhanbad apartment where a massive fire broke out. Rescue operation is still underway at the site. pic.twitter.com/3aZZ1MnbPn
— ANI (@ANI) January 31, 2023
అపార్ట్మెంట్ ప్రమాద ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందినవారికి సంతాపం తెలిపారు. అధికార యంత్రాంగం సహాయ చర్యల్లో వేగంగా పనిచేస్తోందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సీఎం సోరెన్ తెలిపారు. ఘటనపై సమీక్షిస్తున్నట్లు ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.
धनबाद के आशीर्वाद टावर अपार्टमेंट में आग लगने से लोगों की मृत्यु अत्यंत मर्माहत करने वाली है। जिला प्रशासन द्वारा युद्ध स्तर पर कार्य किया जा रहा है तथा हादसे में घायल लोगों को उपचार उपलब्ध कराया जा रहा है। मैं खुद पूरे मामले को देख रहा हूँ।
— Hemant Soren (@HemantSorenJMM) January 31, 2023
కాగా, ఘటనలో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.