‘కోర్టు కంటే ముందు ఆస్పత్రికెళితే మంచిదేమో’
బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతిపైఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేశవ్ప్రసాద్ మౌర్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్కి పాల్పడినట్లు మ
లక్నో: బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతిపైఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేశవ్ప్రసాద్ మౌర్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్కి పాల్పడినట్లు మాయావతి చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు
గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మాయావతి ఆసుపత్రిలో చూపించుకుంటే మంచిదని హితవు పలికారు. 'మాయవతి న్యాయస్థానానికి వెళ్తానంటే మేము భయపడము. కానీ ఆమె కోర్టుకు వెళ్లే ముందు ఒకసారి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. ఆమెకు విశ్రాంతి అవసరం' అని ఎద్దేవా చేశారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి మొదటి నుంచి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవీఎంల్లో అక్రమాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని.. ఈవీఎంల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తుతామని ఆమె చెప్పిన విషయం తెలిసిందే.
కాగా, యూపీ ఎన్నికల్లో 403 సీట్లకు గానూ బీజేపీ(312), మిత్ర పక్షాలతో కలిపి 325 స్థానాల్లో గెలుపొందింది. ఎస్పీ 47, బీఎస్పీ 19, ఆర్ఎల్డీ 1, నిషద్1, ఇండిపెండెంట్(3) సీట్లు గెలుచుకున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications