తమిళనాడులో ట్రాక్టర్ను ఢీకొట్టిన వైద్య విద్యార్థుల వాహనం.. నలుగురు మృతి..
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు మృతిచెందారు. తిరువణ్ణామలై సమీపంలో ట్రాక్టర్ను కారు ఢీకొట్టిగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. వైద్య విద్యార్థులు తిరువణ్ణామలై నుంచి తిండివనానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ప్రమాదానికి కారణం అతి వేగమనేనని తెలుస్తోంది.
ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున సంభవించింది. తిరువణ్ణామలై సమీపంలో ట్రాక్టర్ను కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు వైద్య విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. చిన్న కంగేయనూరు సమీపంలో కారు ట్రాక్టర్ను ఢీకొట్టిన, అనంతరం కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన వారిలో విల్లుపురం జిల్లాకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. ఈ విద్యార్థులంతా కలిసి తిండివనం మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తున్నట్టు ధ్రువీకరించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే, వారంతా చనిపోయారు. పోలీసులు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో విచారణ ప్రక్రియ చేపట్టారు. ఇక, ఈ ప్రమాదం గురించి మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించడం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం అతివేగమనని పోలీసులు నిర్థారించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications