Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tripura, Meghalaya, Nagaland Exit Poll Live: త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ.. మేఘాలయలో టఫ్ ఫైట్..!

ఈశాన్య భారతంలో మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఫిబ్రవరి 27వ తేదీతో ముగుస్తాయి. త్రిపురా, మేఘాలయా, నాగాలాండ్ రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లగా ఇందులో త్రిపురా రాష్ట్రానికి ఫిబ్రవరి 16న పోలింగ్ ముగిసింది. మొత్తం 60 స్థానాలున్న త్రిపురా రాష్ట్రంలో 28.14 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 24.66 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఫలితాలు నాగాలాండ్, మేఘాలయా రాష్ట్రాలతో పాటుగా మార్చి 2వ తేదీన వెలువడుతాయి.

ఇదిలా ఉంటే నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరుగుతుంది. బీజేపీ ఎన్‌డీపీపీలు పొత్తులో భాగంగా 60 స్థానాలకు పోటీచేస్తుండగా ఇందులో బీజేపీ 20 స్థానాలు, ఎన్‌డీపీపీ 40 స్థానాల్లో పోటీచేస్తోంది.నాగాలాండ్‌లో 13.9 లక్షల మంది ఓటర్లున్నారు. మేఘాలయా రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఇదే రోజున పోలింగ్ జరుగుతుంది. 60 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక అదే రోజున సాయంత్రం మూడు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ ఫలితాలు వెలువడుతాయి. రెండు రాష్ట్రాల పోలింగ్‌తో పాటు సాయంత్రం వెలువడే ఎగ్జిట్ ఫలితాలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Meghalaya Nagaland tripura assembly elections live updates in telugu:know the exit poll results

8:23 PM, 27 Feb

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. త్రిపుర, నాగాలాండ్‌లో BJPకి అనుకూలంగా ఉండగా.. మేఘాలయలో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేశాయి.

7:54 PM, 27 Feb

ఎగ్జిట్ పోల్ ప్రకారం NPPకి 27%, బిజెపికి దాదాపు 18%, కాంగ్రెస్ ఓట్ల శాతం 7%, TMC- 19%, PDF- 4%, UDP-9% అంచనా వేసింది.

7:52 PM, 27 Feb

మేఘాలయలో అధికారంలో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అత్యధిక సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ బట్టి తెలుస్తోంది.

7:10 PM, 27 Feb

త్రిపురలో బీజేపీ అధిక సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

6:17 PM, 27 Feb

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి.

5:59 PM, 27 Feb

సాయంత్ర 5 గంటల వరకు నాగాలాండ్ లో 81.94 శాతం పోలింగ్ నమోదు అయింది.

5:55 PM, 27 Feb

మేఘాలయ సాయంత్రం 74.32% ఓటింగ్ శాతం నమోదైంది.

4:18 PM, 27 Feb

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎగ్జిట్ పోల్స్ ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత వెలువడే అవకాశం ఉంది.

4:15 PM, 27 Feb

మధ్యాహ్నం 3 గంటలకు మేఘాలయలో 63.57 శాతం పోలింగ్ నమోదైంది.

3:09 PM, 27 Feb

మేఘాలయలో మధ్యాహ్నం 1 గంటల వరకు 44.73 శాతం పోలీంగ్.

2:31 PM, 27 Feb

నాగాలాండ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు 60.51% పోలింగ్ నమోదైంది.

2:00 PM, 27 Feb

మధ్యాహ్నం ఒంటి గంట వరకు మేఘాలయలో 44%, నాగాలాండ్‌లో 58 శాతం పోలింగ్ నమోదు అయింది.

1:40 PM, 27 Feb

మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా గారో హిల్స్‌లోని తురాలోని వాల్‌బాక్రే -29 పోలింగ్ స్టేషన్‌లో కోసం ఓటు వేశారు.

1:25 PM, 27 Feb

అంపాటి నుంచి టీఎంసీ అభ్యర్థి, మాజీ సీఎం ముకుల్ సంగ్మా కుమార్తె మియాని డి షిరా మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేశారు.

12:58 PM, 27 Feb

ఉదయం 11 గంటల వరకు మేఘాలయలో 26%, నాగాలాండ్‌లో 35% ఓటింగ్ నమోదు అయింది.

12:07 PM, 27 Feb

నాగాలాండ్ లోని కోహిమాలో సీఎం నీఫియు రియో ఓటు వేశారు.

11:31 AM, 27 Feb

మేఘాలయ బిజెపి చీఫ్, వెస్ట్ షిల్లాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎర్నెస్ట్ మావ్రీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

11:04 AM, 27 Feb

నాగాలాండ్ ఎన్నికలు: ఉదయం 9 గంటల వరకు 17.17 శాతం ఓటింగ్ నమోదైనట్లు EC తెలిపింది.

10:04 AM, 27 Feb

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు: ఉదయం 9 గంటల వరకు 10.6 శాతం పోలింగ్ నమోదు అయింది.

9:27 AM, 27 Feb

మేఘాలయలోని మొదటి ఐదుగురు ఓటర్లు మెమెంటోలను అందుకున్నారు. రాష్ట్రంలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 3,419 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. మేఘాలయలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 నియోజకవర్గాలు ఖాసీ, జైంతియా హిల్స్ ప్రాంతంలో ఉండగా, 24 గారో హిల్స్ ప్రాంతంలో ఉన్నాయి.

9:10 AM, 27 Feb

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో వృద్ధులు ఓటు వేసి అందరికి ఆదర్శంగా నిలిచారు.

8:45 AM, 27 Feb

మేఘాలయ, నాగాలాండ్‌లలో రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఓటర్లను కోరారు. "మేఘాలయ మరియు నాగాలాండ్ ప్రజలను, ముఖ్యంగా యువకులు మరియు మొదటి సారి ఓటర్లు, ఈ రోజు రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని" ఆయన ట్వీట్ చేశారు.

8:44 AM, 27 Feb

మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్‌లోని అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్‌లో పింథోరంఖ్రా నుండి బిజెపి అభ్యర్థి AL హెక్ ఓటు వేశారు.

BJP candidate from Pynthorumkhrah, AL Hek casts his vote at a polling station in the Assembly constituency in East Khasi Hills, also meets voters pic.twitter.com/e0uD4q4UOo

— ANI (@ANI) February 27, 2023
8:27 AM, 27 Feb

నాగాలాండ్‌లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 స్థానాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. 2018లో రాష్ట్రంలోని 60 సీట్లలో 12 సీట్లు గెలుచుకున్న బీజేపీ, NDPP (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ)తో కలిసి పోటీ చేస్తోంది. సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

7:57 AM, 27 Feb

మేఘాలయలోని మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు ఓటింగ్ జరగనుండగా, దాదాపు 19000 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు.

7:50 AM, 27 Feb

ఈసారి నాగాలాండ్‌లో నలుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారు.

7:38 AM, 27 Feb

మేఘాలయలోని తురాలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

7:38 AM, 27 Feb

నాగాలాండ్, మేఘాలయలో ప్రారంభమైన పోలింగ్

8:30 PM, 26 Feb

పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్

8:30 PM, 26 Feb

ఇప్పటికే త్రిపురా రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు

READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+