మసీదులోకి వెళ్లి జైశ్రీరామ్ నినాదాలు చెయ్యాలని బలవంతం ?, మాజీ సీఎం !
జమ్మూ/కాశ్మీర్: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్ని ఏకం అవుతున్నాయి. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలో ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మన అన్ని పార్టీలు విజయం సాధించి నరేంద్ర మోదీని ఇంటికి పంపించి మనలో ఎవరో ఒకరు ప్రధాని కావాలని చర్చలు జరిపారు.
ఇప్పుడు వివాదాస్పదం అయిన జమ్మూ కాశ్మీర్ లో ముస్లీంల మీద హిందూ మతం రుద్దడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, అది ఆర్మీ బలగాలతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలోని మసీదులోకి 50 మంది ఆర్ఆర్కు చెందిన ఆర్మీ దళాలు ప్రవేశించి అక్కడి ముస్లింలను జై శ్రీరాం అని నినాదాలు చేయమని బలవంతం చేశారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.

పీడీఎఫ్ నాయకురాలు మెహబూబా ముఫ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ప్రజలను రెచ్చగొట్టే లాగా ప్రవర్థిస్తున్నదని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. మసీదులో బలవంతంగా చొరబడి జైశ్రీరామ్ అని నినాదాలు చెయ్యాలని బలవంతం చేసే విషయంపై దర్యాప్తు జరిపించాలని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కి మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మనవి చేశారు.
లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ జూన్ 14వ తేదీన పాకిస్తాన్తో నియంత్రణ రేఖ (LoC) మరియు కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను అరికట్టడానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన శ్రీనగర్లోని చినార్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీకి నాయకత్వం వహించి అధికారులతో చర్చించారు. మాజీ సీఎం మెహబూబా
ముఫ్తీ ట్వీట్ చేస్తూ 50 ఆర్ఆర్కి చెందిన ఆర్మీ దళాలు పుల్వామాలోని మసీదులోకి చొరబడి లోపల ఉన్న ముస్లింలను జై శ్రీరాం అని నినాదాలు చెయ్యాలని బలవంతం చేశారని, ఈ విషయం తాను విని షాక్ అయ్యానని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు.
కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ఇక్కడ ఉన్నప్పుడు మరియు అది కూడా యాత్రకు ముందు అలాంటి చర్య కేవలం రెచ్చగొట్టే చర్య అని, తక్షణమే ఈ విషయంలో విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని రాజీవ్ ఘయ్కి మనవి చేశామని మాజీ సీఎం మెహబూబ్ ముఫ్తీ అన్నారు. ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన G20 ఈవెంట్కు ముందు స్థానిక యువకులను అరెస్టు చేసి హింసించారని మాజీ సీఎం మెహబూబ ముఫ్తీ ఆరోపించారు.

జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. కేంద్ర భూభాగంలో G20 ఈవెంట్ను నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించినప్పటి నుండి వందలాది మంది స్థానిక పురుషులను అదుపులోకి తీసుకున్నారని పీడీఎఫ్ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
శ్రీనగర్ లో మేలో G20 ఈవెంట్లలో ఒకదానిని నిర్వహించింది. దేశంలోని చాలా ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద ఏదో ఒకరకంగా ఆరోపణలు చెయ్యడం మొదలుపెట్టాయి.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications