హమ్మయ్యా.. ఎట్టకేలకు విముక్తి.. ఏడాదికిపైగా నిర్భందం.. ముప్తీ విడుదల..
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ నేతల నిర్భందం కొనసాగింది. మాజీ ముఖ్యమంత్రులు మొహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా తదితరులను నిర్బంధించిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చి.. 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్.. స్వయంగా కశ్మీర్లో పర్యటించి.. పరిస్థితిని సమీక్షించారు. తర్వాత పరిస్థితులు మారడంతో క్రమంగా ఆంక్షలను తొలగించారు. షాపులు, స్కూళ్లు తెరచుకున్నాయి. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ఇప్పుడు నేతల నిర్భందం నుంచి విడుదల చేశారు.

మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత మొహబూబా ముప్తీని నిర్భందం నుంచి విడుదలచేస్తున్నామని జమ్ముకశ్మీర్ అధికారులు తెలిపారు. ఈ మేరకు కశ్మీర్ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ ట్వీట్ చేశారు. ప్రజా భద్రత చట్టం కింద ముప్తీపై గల నిర్బంధాన్ని జూలైలో మరోసారి పొడగించారు. 3 నెలలు పొడిగంచగా.. పరిస్థితులు సద్దుమణగడంతో వెనక్కి తీసుకున్నారు. దీంతో ముప్తీపై గల నిర్భందం ముగిసిందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాపై కూడా నిర్భందం విధించారు. అయితే వారిపై మార్చి నెలలో డిటెన్షన్ ఎత్తివేశారు. ఇప్పుడు ముప్తీపై ఆంక్షలను తొలగించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications