వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోవా రన్ వేపై కూలిన మిగ్29 విమానం: పైలట్, ట్రెయినీ సురక్షితం
పనాజీ: పనాజీ: ఎంఐజి-29కే ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్టులో మంటలు వచ్చాయి. ఆ తర్వాత అది కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, ఓ ట్రెయినీ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఎంఐజీ 29కే ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ నేవీకి చెందినది. ఇది శిక్షణ ఇచ్చే విమానం.
బుధవారం మిగ్ 29కే యుద్ధ విమానం కూలినట్లు అధికారులు తేల్చారు. ఆ విమనాంలో ట్రెయినీ పైలట్ ఉన్నట్లు తెలిపారు. గోవా ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న నేవీకి చెందిన విమానం కొన్ని క్షణాలకే కూలిపోయిందని తెలుస్తోంది.
విమానంలో చెలరేగిన మంటల్ని ఆర్పుతున్నారు. ఈ ప్రమాదం జరగడంతో గోవా విమానాశ్రయాన్ని మూసివేశారు. రన్వే మీదే మిగ్ శకలాలు పడ్డాయి.
Comments
English summary
A MiG-29K fighter on a training sortie veered off the runway at Dabolim aiport on Wednesday and caught fire but the pilot ejected safely, an Indian Navy spokesperson said.