భారత్ అదుపులో పీవోకే బాలుడు -చొరబాటా? పొరపాటా? -పాక్ పైశాచికానందం
కొత్త ఏడాది తొలిరోజే జమ్మూకాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద కలకలం చోటుచేసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు చెందిన ఒక బాలుడ్ని భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సరిహద్దు దాటి పీవోకే నుంచి జమ్ముకశ్మీర్లోకి ప్రవేశించిన 14 ఏండ్ల బాలుడ్ని పూంచ్లోని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గుర్తించింది.
సరిహద్దును ఆనుకుని ఉండే పూంఛ్ జిల్లాలోని అజోట్ గ్రామం సమీపంలోని బతర్ నల్లా వద్ద సంచరిస్తోన్న బాలుణ్ని మన బలగాలు పట్టుకున్నాయి. పీవోకేకు చెందిన బాలుడు తమ అదుపులో ఉన్నట్లు పూంచ్ ఎస్ఎస్పీ రమేష్ అంగ్రాల్ తెలిపారు. అతడు పొరపాటున సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించి ఉంటాడని చెప్పారు. ఆ బాలుడి చొరబాటులో ఎలాంటి దురుద్దేశం లేనిపక్షంలో పాకిస్థాన్ అధికారులతో చర్చలు జరిపి అతడ్ని అప్పగిస్తామని వెల్లడించారు. కాగా,

పది రోజుల కిందటే.. గుజరాత్ తీరంలోని భారత జలాల్లోకి ఓ పాకిస్తానీ పౌరుడు బోటులో ప్రవేశించగా, సమగ్ర వివరాలు సేకరించి, అనుమానం తీరాక మనవాళ్లు అతణ్ని వెనక్కి పంపారు. ఇటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి సరిహద్దులు దాటి జమ్ముకశ్మీర్లోకి చిన్నారులు ప్రవేశించడం తరచుగా జరుగుతున్నది. గత నెలలో పీవోకేకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు పొరపాటున భారత్వైపునకు రాగా.. సైనిక అధికారులు వారిని గుర్తించి, వివరాలు తెలిసిన తర్వాత బహుమతులు ఇచ్చి పీవోకేకు తిరిగి పంపారు. అయితే..
భారత్ సాధ్యమైనంతలో గెశ్చర్ పాటిస్తున్నప్పటికీ దాయాది పాకిస్తాన్ మాత్రం పైశాచికంగా వ్యవహరిస్తున్నది. గడిచిన 18 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2020 ఏడాదిలో ఏకంగా 5,100సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లుపొడిచింది. దాయాది సైన్యం దుశ్చర్యల నుంచి సరిహద్దు ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు భారత ప్రభుత్వం 14వేలకుపైగా బంకర్లను నిర్మిస్తున్నది.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications