మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు, అతనిని ఏం చేశారంటే
మైనర్ విధ్యార్థిని ఉపాధ్యాయుడు గర్భవతిని చేసిన ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.
ముంబాయి: విధ్యార్థులను మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే చెడు మార్గంలో పయనిస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువులది స్థానం అయితే గురువులు మాత్రం చెడుమార్గంలో పయనిస్తోన్న ఘటనలు ఇటీవలకాలంలో ఎక్కువయ్యాయి. కన్న కూతురుగా చూడాల్సిన విధ్యార్థిని గర్భవతిని చేశాడో ఉపాధ్యాయుడు. ఈ విషయం బయటకు రావడంతో పారిపోయాడు.నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.
ముంబాయిలోని ఓ స్కూల్లో 42 ఏళ్ళ ఉపాధ్యాయుడు 13 ఏళ్ళ మైనర్ బాలికను పాఠశాలలోనే అత్యాచారం చేశాడు. రెండు సార్లు పాఠశాలలోనే విధ్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్, ఆగష్టు మాసాల్లో ఆ విధ్యార్థినిపై నిందితుడు అత్యాచారం జరిపాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.

తోటి విధ్యార్థినులు ఆడుకొనే సమయంలో మైనర్ విధ్యార్థిని తరగతి గదికి పిలిపించుకొని ఉపాధ్యాయుడు అత్యాచారం జరిపేవాడు.అయితే కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అప్పుడు ఆమె గర్భం దాల్చిన విషయం బయటపడింది.
వైద్యులు చెప్పిన మాటలు విని బాలిక తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉపాధ్యాయుడికి భార్య, కుమారుడు ఉన్నారు. నిందితుడిని పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుతో నిందితుడిని విధులనుండి తప్పించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications