జెండర్ జస్టిస్: ట్రిపుల్ తలాక్ బిల్లుపై మోడీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఏకాభిప్రాయంతో వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించే నేపథ్యంలో ఆయన గురువారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు.
ట్రిపుల్ తలాక్ బిల్లు జెండర్ జస్టిస్, భద్రత, గౌరవం కోసం ప్రవేశపెడుతున్నామని, బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించేలా చూడాలని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనంత కుమార్ మీడియాకు వెల్లడించారు.

బిల్లును ప్రతిపాదించే సమయంలో సభ్యులందరూ లోకసభకు హాజరు కావాలని బిజెపి ఏకవాక్యంతో విప్ జారీ చేసింది. బిల్లును న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోకసభలో ప్రతిపాదిస్తారు.












Click it and Unblock the Notifications