బెంగాల్లో ఆ సాధారణ కుటుంబ సభ్యులకు మోడీ ప్రత్యేక ఆహ్వానం
పశ్చిమ బెంగాల్: ప్రధాని నరేంద్ర మోడీ మంచి సంస్కృతికి తెరతీశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల నుంచే అతిథులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం మోడీ ప్రమాణ స్వీకారంలో కొందరు కొత్త అతిథులు కనిపించనున్నారు. బెంగాల్లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. వీరి కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక మొత్తంగా 50 కుటుంబాలను ఈ కార్యక్రమానికి మోడీ ఆహ్వానించారు.
ఓ నివేదిక ప్రకారం గత ఆరేళ్లలో ఎన్నికల జరిగిన సందర్భంలో నిన్నటి లోక్సభ పోలింగ్ సందర్భంగా బెంగాల్లో చెలరేగిన హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు 51 మంది మృతి చెందారు. వీరి కుటుంబ సభ్యులను ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పంపడంతో వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. తృణమూల్ కార్యకర్తల చేతిలో తన తండ్రి హత్యకు గురయ్యాడని బెంగాల్ మిద్నాపూర్ బీజేపీ కార్యకర్త మను హన్సద్ కొడుకు చెప్పాడు. అయితే ఢిల్లీ నుంచి పిలుపు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ప్రస్తుతం తమ ప్రాంతంలో శాంతి నెలకొందని హన్సద వెల్లడించాడు. ఇదిలా ఉంటే మిద్నాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విజయం సాధించారు.
Midnapore: Kin of BJP workers (who were killed in West Bengal in political violence) invited to the swearing-in ceremony of PM Narendra Modi. Son of Late Manu Hansda says,"My father was killed by TMC goons. We are happy that we are going to Delhi. There's peace in our area now." pic.twitter.com/P0uR6bBLXp
— ANI (@ANI) May 29, 2019

బెంగాల్లో ఒకప్పుడు రెండు సీట్లు గెల్చుకున్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 18 సీట్లు గెలుచుకుని ఆ రాష్ట్రంలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో బీజేపీ ఆ రాష్ట్రంపై కన్నేసింది. మమతా బెనర్జీకి బీజేపీ పెద్ద తలనొప్పిగా తయారైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఆదివారం బీజేపీ నేత ముకుల్ రాయ్ 50 మంది తృణమూల్ కౌన్సిలర్లు, ఇద్దరు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్లారు.వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది మమతా బెనర్జీకి మరో షాక్ ఇచ్చినట్లయ్యింది. ఇక భవిష్యత్తులో తృణమూల్ కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు కమలనాథులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications