మోడీ ఓకే: ఇప్పుడు ఎన్నికలొచ్చినా 300పైనే సీట్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుపై దేశ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు కన్నా ప్రధాని మోడీ పని తీరుకు ప్రజలు ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. ఏబీపీ న్యూస్-నీల్సన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ప్రభుత్వం బాగుంది లేదా చాలా బాగుంది అని 46శాతం మంది చెప్పారు.
కాగా, మోడీకి ఇంతకన్నా ఎక్కువ రేటింగ్ లభించింది. ఆయన పనితీరు బాగుంది లేదా చాలా బాగుంది అని 54శాతం మంది చెప్పారు. లోక్సభ ఎన్నికలు ఇప్పటికిప్పుడు(బుధవారం) నిర్వహించినట్లయితే ఎన్డీఏకు 38శాతం ఓట్లతో 301 స్థానాలు లభించవచ్చని ఈ పోల్ పేర్కొంది.
2014, మేలో నిర్వహించిన ఎన్నికల్లో ఎన్డీఏకు 339 స్థానాలు లభించాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 28శాతం ఓట్లతో 108 స్థానాలు రావచ్చని ఈ పోల్ వెల్లడించింది. గత ఎన్నికల్లో యూపీఏకు 62స్థానాలు వచ్చాయి.
బిజెపికి 43శాతం ఓట్లు, కాంగ్రెస్కు 14శాతం ఓట్లు, ఆమ్ఆద్మీ పార్టీకి 4 శాతం ఓట్లు లభించవచ్చని ఈ ఒపీనియన్ పోల్లో వెల్లడైంది. మోడీ ఆదరణ రోజు రోజుకూ తగ్గుతోందని దాదాపు 47శాతం మంది ఈ సర్వేలో అభిప్రాయపడగా, 45శాతం మంది అందుకు భిన్నంగా స్పందించారు.