బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Press meet: ప్రెస్ మీట్ పెట్టి టేబుల్ మీద రూ. 10 లక్షలు పెట్టిన మాజీ మంత్రి, ఎందుకంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హాసన్: మాజీ ప్రధాన మంత్రి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అన్న, మాజీ మంత్రి అయిన హెచ్.డి. రేవణ్ణ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి మీడియా సభ్యులు అందర్ని పిలిచారు. ప్రెస్ మీట్ పెట్టిన మాజీ మంత్రి ఒక్కసారిగా టేబుల్ మీద రూ. 10 లక్షల నోట్లకట్టలు పెట్టారు. ప్రెస్ మీట్ కు వెళ్లిన మీడియా సోదరులు ఆ సీన్ చూసి షాక్ అయ్యారు. సార్.... ఎందుకు అంత డబ్బు టేబుల్ మీద పెట్టారు అని ప్రశ్నిస్తే మాజీ ప్రధాని కొడుకు హెచ్.డి. రేవణ్ణ ఒక్కాసారిగా సీఎం పీఏ మీద విరుచుకుపడ్డారు.

Illegal affair: ప్రియురాలు నాటుకోడి, రివర్స్, బైపాస్ లో గొంతు కోసి పెట్రోల్ పోసి కాల్చేశాడు!Illegal affair: ప్రియురాలు నాటుకోడి, రివర్స్, బైపాస్ లో గొంతు కోసి పెట్రోల్ పోసి కాల్చేశాడు!

 మాజీ ప్రధాని కుమారుడు

మాజీ ప్రధాని కుమారుడు

భారత మాజీ ప్రధాన మంత్రి హెచ్.డి. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి అన్న, కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ ఏదోఒక ప్రత్యేకత ఉంటుంది. గతంలో చేతిలో నిమ్మకాయలు పెట్టుకుని కర్ణాటక అసెంబ్లీ (విధాన సౌధ)లోకి వెళ్లిన హెచ్.డి. రేవణ్ణ అప్పట్లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.

 ప్రెస్ మీట్...... టేబుల్ మీద రూ. 10 లక్షల క్యాష్

ప్రెస్ మీట్...... టేబుల్ మీద రూ. 10 లక్షల క్యాష్

ఇప్పుడు మరోసారి కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే హెచ్ డీ. రేవణ్ణ హాట్ టాపిక్ అయ్యారు. శుక్రవారం హాసన్ లో హెచ్.డీ. రేవణ్ణ మీడియా మిత్రులు అందర్ని ప్రెస్ మీట్ కు పిలిచారు. ప్రెస్ మీట్ కు వెళ్లిన మీడియా మిత్రులు అందరూ కుర్చున్నారు. మీడియా సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే శివలింగేగౌడతో కలిసి వచ్చిన హెచ్.డీ. రేవణ్ణ ఒక్కసారిగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు తీసి టేబుల్ మీద పెట్టడంతో అందరూ షాక్ అయ్యారు.

 సీఎం పీఏ ఏమనుకుంటున్నాడు ?

సీఎం పీఏ ఏమనుకుంటున్నాడు ?

సార్ అంత డబ్బులు టేబుల్ మీద ఎందుకు పెట్టారు ? అని మీడియా మిత్రులు ప్రశ్నించారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న హెచ్.డీ. రేవణ్ణ ఒక్కసారిగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప రాజకీయ కార్యదర్శి ( పీఏ) సంతోష్ మీద విరుచుకుపడ్డారు. మా పార్టీ (జేడీఎస్ పార్టీ) నాయకులను కొనుగోలు చెయ్యడానికి సీఎం బీఎస్. యడియూరప్ప పీఏ సంతోష్ ఈ డబ్బులు ఎరగా ఉపయోగించాడని మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ ఆరోపించారు.

 నగరసభ సభ్యులు

నగరసభ సభ్యులు

హాసన్ జిల్లా అరసికెరె నగర సభ (మేజర్ మునిసిపాలిటి) సభ్యులు బీజేపీలో చేరడానికి సీఎం పీఏ సంతోష్ రూ. 10 లక్షలు ఇచ్చాడని, మా మాటవినకుండా జేడీఎస్ పార్టీలోనే ఉంటే మీ అంతుచూస్తామని, రాష్ట్రంలో. కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నామని సంతోష్ మా సభ్యులను బెదిరిస్తున్నాడని మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ ఆరోపించారు.

 సీబీఐ విచారణ చెయ్యాలి

సీబీఐ విచారణ చెయ్యాలి

ఎన్నికల్లో అరసికెరె నగరసభలో జేడీఎస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టిందని, 7 మంది మా పార్టీ సభ్యులకు రూ. 10 లక్షల చొప్పున ఇచ్చి బీజేపీలోకి చేర్చుకున్నారని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ. స్థానిక శాసన సభ్యుడు శివలింగేగౌడ ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన మా పార్టీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నించిన సంతోష్ మీద కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ డిమాండ్ చేశారు.

English summary
Money: JD(S) party leader H. D. Revanna and Arasikere JD(S) MLA Shivalinge Gowda press conference in Hassan with money of 10 lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X