వెదర్ రిపోర్ట్: అస్సాం, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు కొంత బలహీనంగా కొనసాగుతున్నాయి. థానే, ముంబై, అహ్మద్ నగర్, బుల్ధానా, గోండియా, టిట్లగఢ్, కటక్, మిడ్నాపూర్, గోవల్పర, బఘ్డోడ్రా ప్రాంతాలపై రుతుపవనాలు ప్రభావం చూపుతున్నాయి.
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాలు ఈ మేరకు వెలువరించింది. అస్సాం, మేఘాల రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కిం, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండర్, తమిళనాడు, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు తీర ప్రాంతం, లక్షద్వీప్ తీర ప్రాంతం, ఒడిశా పశ్చిమబెంగాల్ తీవ్ర ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల సముద్ర తీరాల్లో పెద్ద అలలు వచ్చే అవకాశం ఉంది. సముద్ర ప్రాంతం కొంత భయంకరంగా ఉండనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది.

కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈశాన్యం, మహారాష్ట్ర నుంచి రుతుపవనాలు ఉత్తరాదికి కదిలాయి.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications