కన్న తల్లి ఇలానా?: ముగ్గురు పిల్లలను బావిలో పడేసింది
భువనేశ్వర్: ఏ తల్లీ చేయని దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. తన సంతాన్ని ఏ తల్లి అయినా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ, ఇక్కడ మాత్రం తన ముగ్గురు సంతానాన్ని ఓ లోతైన బావిలో పడేసి దారుణంగా చంపేసింది. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రం నౌపాద జిల్లాలోని కేశరాజ్పూర్లో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కళ్యాణ్ సింగ్ మాఝీ, లొచ్చాని మాఝీ దంపతులకు ముగ్గురు సంతానం. కాగా, లొచ్చాని మాఝీ గత గురువారం స్థానికంగా ఉన్న ఓ బావి వద్ద ఏడుస్తూ గ్రామస్తులకు కనిపించింది. దీంతో అక్కడకు చేరుకున్న గ్రామస్తులు ఏం జరిగిందని ఆమెను ప్రశ్నించారు.
దీంతో బావిలో చనిపోయి ఉన్న తన ముగ్గురు సంతానాన్ని చూపించింది లొచ్చాని. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో కొందరు గ్రామస్తులు చనిపోయిన ముగ్గురు చిన్నారుల(ఇద్దరు మగ పిల్లలు, ఒక అమ్మాయి) మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు.

చనిపోయిన చిన్నారులను శశిభూషణ్(4), 18నెలల లక్ష్మణ్ మాఝీగా గుర్తించారు. ఘటనపై పోలీసులు లొచ్చానీని విచారించగా అసలు విషయం చెప్పింది. తానే తన పిల్లలను బావిలో పడేసి చంపినట్లు అంగీకరించింది. లొచ్చాని ఈ దారుణానికి పాల్పడిన సమయంలో ఇంట్లో ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లొచ్చానిని అరెస్ట్ చేశారు. అయితే, చిన్నారులను వారి తల్లి లొచ్చాని ఎందుకు చంపిందనే విషయం మాత్రం తెలియరాలేదు. తన భర్తతో ఏదైనా గొడవ జరిగి ఈ దారుణానికి ఒడిగట్టిందా? లేక ఆమె మానసిక పరిస్థితి బాగోలేకనే అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications