2030 నాటికి మురికివాడలు లేని ముంబై: డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఏక్‌నాథ్ షిండే!

మాయానగరి ముంబై రూపురేఖలను పూర్తిగా మార్చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. 2030 నాటికి ముంబైని మురికివాడలు లేని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 'సమగ్ర క్లస్టర్ పునరాభివృద్ధి' ప్రణాళికను మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎక్ నాథ్ షిండే ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పన, భారీ గృహనిర్మాణమే ప్రధాన అజెండాగా సాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏకంగా 15 లక్షల పునరావాస గృహాలను నిర్మించనున్నారు. ముంబై ఇకపై మురికివాడలు, అస్తవ్యస్త వృద్ధి అనే పాత ముద్రను చెరిపేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

మహారాష్ట్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ప్రభుత్వం... ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) పరిధిలో మొత్తం 19 క్లస్టర్ పునరాభివృద్ధి జోన్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఇరుకుగా, రద్దీగా ఉండే ప్రాంతాలను విశాలమైన రోడ్లు, అందమైన ఉద్యానవనాలు, పాఠశాలలు, ఆధునిక పౌర సౌకర్యాలతో కూడిన ప్రణాళికాబద్ధమైన పట్టణ ప్రాంతాలుగా మార్చబోతున్నారు. ప్రజలు మురికి కాలువల పక్కన, కనీస పారిశుధ్యం లేని అమానవీయ పరిస్థితుల్లో బతకాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన సొంత ఇల్లు అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేసింది.

Mumbai Slum-Free Mission 2030 Eknath Shinde Announces Massive 15 Lakh Houses Cluster Redevelopment Plan

కేవలం బిల్డింగులు కాదు.. జీవితాల మార్పు!

"ఇది కేవలం భవనాల పునరాభివృద్ధి మాత్రమే కాదు... ప్రజల జీవితాల్లో, వారి జీవన వ్యవస్థల్లో రాబోయే విప్లవాత్మక మార్పు" అని ప్రభుత్వం ఉద్ఘాటించింది. ప్రసిద్ధ బిడిడి (BDD) చాల్స్ పునరాభివృద్ధి ప్రాజెక్ట్ విజయవంతం కావడమే దీనికి నిదర్శనం. ఈ కొత్త ప్లాన్ ద్వారా ప్రామెనేడ్, రేస్‌కోర్స్ వంటి ప్రాజెక్టుల వల్ల ముంబై నగరానికి అదనంగా 300 హెక్టార్ల బహిరంగ ప్రదేశాలు (ఓపెన్ స్పేసెస్) అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం MMRDA, MIDC, CIDCO, SRA, MHADA వంటి కీలక ప్రభుత్వ సంస్థలన్నీ చేతులు కలిపి ఒకే తాటిపై పనిచేస్తున్నాయి.

బిహార్ లో భారీ కంటి సంరక్షణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అదానీ
బిహార్ లో భారీ కంటి సంరక్షణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అదానీ

ధారవి రూపురేఖలు మారబోతున్నాయి!

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ధారవిలో ఈ ప్రాజెక్ట్ కింద 1.5 లక్షల పునరావాస ఇళ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం అక్కడ 1,000 మందికి ఒకే మరుగుదొడ్డి ఉండే దారుణమైన పరిస్థితులు సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ధారవిని విమానాశ్రయం, సబర్బన్ రైల్వే, మెట్రో, బెస్ట్ (BEST) బస్ నెట్‌వర్క్‌లతో అనుసంధానిస్తూ ఒక భారీ 'మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్'గా మార్చనున్నారు. అలాగే మిఠీ నది సుందరీకరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కాగా, ధారవి మార్పును ప్రతిబింబించే 'ధారవి ఎక్స్‌పీరియన్స్ సెంటర్' ఆగస్టు 15 నాటికి సిద్ధం కానుంది.

మురికివాడకు మహార్దశ.. అదానీ అండతో మోడల్ టౌన్ షిప్ గా మారనున్న ధారావి
మురికివాడకు మహార్దశ.. అదానీ అండతో మోడల్ టౌన్ షిప్ గా మారనున్న ధారావి

గడిచిన 25 ఏళ్లలో SRA కేవలం 2.9 లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించగా... ఈ కొత్త క్లస్టర్ మోడల్ ద్వారా 2030 నాటికి ఒక్క SRA ద్వారానే ఏడు లక్షల పునరావాస గృహాలను నిర్మించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు, స్టార్టప్‌లు, మౌలిక సదుపాయాల కల్పనలో ముంబై ఇప్పటికే దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఈ అంతర్జాతీయ స్థాయి పట్టణ మార్పులు ముంబై యొక్క ఆర్థిక నాయకత్వాన్ని ప్రపంచ పటంలో మరింత పటిష్టం చేస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+