వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైక్‌పై అసభ్య భంగిమ: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జంటకు గోవా పోలీసులు జరిమానా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పనాజీ: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జంటకు గోవా పోలీసులు జరిమానా విధించారు. మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తూ అసభ్య చేష్టలకు పాల్పడటంతో వారికి రూ. 1000 జరిమానా విధించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

సమ్మర్ స్పెషల్‌గా గోవాకు వెళుతున్న ఈ జంట మండోవీ వంతెనపై అసభ్య భంగిమలో బైక్‌పై వెళుతుండగా, ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియా వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ అసభ్య భంగిమపై సర్వత్రా విమర్శలు రావడంతో పాటు, కొద్ది క్షణాల్లోనే పోలీసులకు చేరిపోయింది.

MP Couple fined for 'indecent' driving in Goa

దీంతో రంగంలోకి దిగిన గోవా పోలీసులు బైక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా దాని యజమానిని వాకబు చేసి, ఆ తర్వాత ఆ జంట నివసిస్తోన్న హోటల్ అడ్రస్ పోలీసులు కనుగొన్నారు. ఆ జంట గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌‌లో బస చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి జరిమానా విధించినట్లు తెలిపారు.

English summary
A Madhya Pradesh-based couple was fined for 'indecent and dangerous driving' here after their picture of riding a bike on a bridge violating traffic rules went viral on social media, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X